ఆస్తులపై దొంగ లెక్కలు
ఆస్తులపై దొంగ లెక్కలు చెప్పడంద్వారా బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై న్యూయార్క్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
ఆర్థిక సంస్థలను మోసం చేసిన ట్రంప్
న్యూయార్క్ కోర్టులో విచారణ
రాజకీయ కుట్రన్న మాజీ అధ్యక్షుడు
దిల్లీ: ఆస్తులపై దొంగ లెక్కలు చెప్పడంద్వారా బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై న్యూయార్క్ కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ట్రంప్ హాజరయ్యారు. అటార్నీ జనరల్ లెతీతియా జేమ్స్ వేసిన ఈ కేసులో మోసానికి ట్రంపే కారణమని న్యాయవాదులు ఆరోపించారు. ‘ట్రంప్ తన ఆదాయ వ్యయ వివరాలను తప్పుగా చూపారు. ఏటికేడు అబద్ధాలను చెబుతూ వచ్చారు’ అని అటార్నీ కార్యాలయ న్యాయవాది కెవిన్ వాలెస్ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనలను డిఫెన్స్ న్యాయవాదులతో కలిసి కూర్చున్న ట్రంప్ ఖండించారు. ‘ఇది రాజకీయ కుట్ర. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఎన్నికల్లో నన్ను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నం. దేశ ప్రజలు దీనిని నమ్ముతారని అనుకోవడం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాపారంలో మోసానికి పాల్పడ్డారని ఈ కేసులో గత వారమే న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరోన్ రూలింగ్ ఇచ్చారు. పై కోర్టులో అప్పీల్లోనూ ఈ రూలింగ్ను సమర్థిస్తే ట్రంప్ న్యూయార్క్లోని తన ఆస్తులను వదులుకోవాల్సి ఉంటుంది. అందులో ట్రంప్ టవర్, వాల్స్ట్రీట్ కార్యాలయ భవనం, గోల్ఫ్ కోర్సులు, సబర్బన్ ఎస్టేట్ ఉన్నాయి. అయితే దీనిని కార్పొరేట్ మరణ శిక్షగా ట్రంప్ అభివర్ణించారు. న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు ఇంకో 6 అంశాలపైనా న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 25 కోట్ల అమెరికా డాలర్ల జరిమానాతోపాటు న్యూయార్క్లో వ్యాపారం చేయకుండా ట్రంప్పై నిషేధం విధించాలని అటార్నీ జనరల్ జేమ్స్ కోరుతున్నారు. ట్రంప్ తన ఆస్తులను మరీ ఎక్కువ చేసి 3.6 బిలియన్ డాలర్లుగా చూపారని ఆమె తెలిపారు. మన్హట్టన్లోని మూడంతస్థుల పెంట్ హౌస్లో బంగారు పరికరాలను అమర్చానని చెప్పి 327 మిలియన్ డాలర్లుగా చూపించారని, న్యూయార్క్లో ఇంతవరకూ ఏ అపార్ట్మెంట్ ఫ్లాట్ అంత ధరకు అమ్ముడుపోలేదని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
భూకక్ష్యలోకి తొలిసారిగా ఇటీవల తాము ప్రవేశపెట్టిన నిఘా ఉపగ్రహం శ్వేతసౌధం, పెంటగాన్ సహా అమెరికాకు చెందిన నౌకాస్థావరాల చిత్రాలను తీసినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. -
అయిదు రోజులు నిద్ర లేకుండా లైవ్ స్ట్రీమింగ్లో ఆడి.. ప్రాణాలు హరీ
చైనాలో ఓ విద్యార్థి నిద్రాహారాలు మాని లైవ్ స్ట్రీమింగులో గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయాడు. హెనాన్స్ పింగ్డింగ్షాన్ వొకేషనల్ అండ్ టెక్నికల్ కళాశాలలో లీ హావో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
అప్పటి వరకూ ఈ ట్యాగ్ ధరిస్తా: మస్క్
సామాజిక మాధ్యమంలో యూదు వ్యతిరేక పోస్టులకు మద్దతు తెలిపిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన 2 రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఇజ్రాయెల్కు వచ్చారు. -
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతోపాటు 7 దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజులపాటు పర్యటించవచ్చు. -
అమెరికాలో పొగమంచు.. ఢీకొట్టుకున్న 30 వాహనాలు
అమెరికాలోని ఐడహో రాష్ట్రంలో పొగమంచు వల్ల ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి ఇంటర్స్టేట్ 86 రహదారిపై సుమారు 30 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. -
రష్యా సరిహద్దులు పూర్తిగా మూసివేత: ఫిన్లాండ్
రష్యాతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసివేయనున్నట్లు ఫిన్లాండ్ ప్రకటించింది. ఇప్పటికే పలు సరిహద్దు దారులను మూసివేసిన ఆ దేశం చివరి రహదారినీ మూసివేయన్నట్లు వెల్లడించింది. వలసలను అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. -
అమెరికాకు సహకరిస్తాం.. కెనడాకు లేదు!
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తునకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ వెల్లడించారు. -
మరో 11 మంది బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా నాలుగో విడత బందీల విడుదల మంగళవారం ఉదయానికి పూర్తయింది. హమాస్ 11 మందిని, ఇజ్రాయెల్ 33 మందిని విడుదల చేశాయి. -
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
అమెరికాలోని పలు ఆస్పత్రులపై సైబర్ దాడి జరిగింది. దీంతో అత్యవసర వైద్య సేవలు, ఇతర సదుపాయాలకు అంతరాయం ఏర్పడింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
-
Top Ten News @ Election Special: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే
-
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని