అవి మా ప్రాంతాలు.. నిర్మాణాలు ఆపండి
‘భారత సరిహద్దులోని లింపియాధురా, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలు నేపాల్లో అంతర్భాగం. అక్కడ చేపడుతున్న నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులన్నీ ఇండియా ఆపాలి’ అంటూ నేపాల్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. సరిహద్దు
నేపాల్ పునరుద్ఘాటన
కాఠ్మాండూ: ‘భారత సరిహద్దులోని లింపియాధురా, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలు నేపాల్లో అంతర్భాగం. అక్కడ చేపడుతున్న నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులన్నీ ఇండియా ఆపాలి’ అంటూ నేపాల్ ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. సరిహద్దు సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ‘నేపాల్తో మా సరిహద్దుల విషయంలో స్పష్టంగా ఉన్నాం. ఎలాంటి సందిగ్ధానికి చోటు లేదు. ఈ విషయమై నేపాల్ ప్రభుత్వంతో కూడా చర్చించాం’ అని కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించిన మరుసటిరోజే నేపాల్ ఇలా స్పందించడం గమనార్హం. మరోవైపు.. లిపులేక్లో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా నేపాల్లో ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు