ఉగ్రవాదులంతా పాక్లోనే దాక్కుంటారు
ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రమంటూ ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, మూలాలు పాక్లోనే ఉంటాయని పేర్కొంది. ఐరాస భద్రతా మండలిలో
ఆ విషయంలో ఆ దేశ రికార్డు తిరుగులేనిది
లాడెన్ కూడా అక్కడే దొరికాడు
ఐరాసలో విరుచుకుపడిన భారత్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రమంటూ ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో భారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా, మూలాలు పాక్లోనే ఉంటాయని పేర్కొంది. ఐరాస భద్రతా మండలిలో ‘సాయుధ సంఘర్షణల్లో సాధారణ పౌరుల రక్షణ’ అంశంపై చర్చ జరిగింది. చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి మునీర్ అక్రమ్.. జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై ఐరాసలోని భారత ప్రతినిధి మధుసూధన్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్పై విష ప్రచారానికి ఐరాసను పాక్ వేదికగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. పాక్లో సాధారణ ప్రజలు, అల్పసంఖ్యాక వర్గాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, వాటి నుంచి దృష్టి మరల్చటానికే పాక్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహించారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మూలాలు పాక్లోనే దొరుకుతాయని తెలిపారు. ముష్కరులకు ఆశ్రయమివ్వడంలో పాక్ రికార్డు తిరుగులేనిదని, ఒసామా బిన్ లాడెన్ కూడా అక్కడే దొరికాడని గుర్తు చేశారు. జమ్ము, కశ్మీర్, లద్దాఖ్.. భారత్లోని భూభాగాలని స్పష్టం చేశారు. పాకిస్థానే అక్రమంగా కశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించిందని, దాన్ని వెంటనే భారత్కు అప్పగించాలని మధుసూధన్ డిమాండ్ చేశారు. ముంబయి 26/11 దాడుల సూత్రధారులకు పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని సభ్యదేశాల దృష్టికి తీసుకొచ్చారు.
టీకా కార్యక్రమాన్ని ప్రశంసించిన ఐరాస
కొవిడ్-19ను ఎదుర్కోవడంలో భారత్ పోషిస్తున్న పాత్రను ఐరాస అభినందించింది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ కార్యక్రమం భారత్లో విజయవంతంగా సాగుతోందని పేర్కొంది. ‘‘భారత్లోని మా భాగస్వాములతో కొవిడ్ నియంత్రణకు మా వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకు 60 కోట్ల మంది ప్రజల్లో చైతన్యం కలిగించాం ప్రపంచంలో అతి పెద్దదైన భారత్ టీకా కార్యక్రమానికి మద్దతిస్తున్నాం. ఇందులో భాగంగా సమర్థవంతమైన నిఘా, పర్యవేక్షణ కార్యక్రమాలను రూపొందించాం. ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచాం. వ్యక్తిగత రక్షణ పరికరాలను ఆరోగ్య సిబ్బందికి అందించాం’’ అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత