China: త్వరలో మళ్లీ చైనాకు భారత విద్యార్థులు
కొవిడ్ ఆంక్షల్లో భాగంగా గత రెండేళ్లుగా వీసాల జారీపై బీజింగ్ విధించిన నిషేధంతో భారత్లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది విద్యార్థులను త్వరలో మళ్లీ వెనక్కు రప్పిస్తామని భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది.
కొవిడ్ ఆంక్షలతో రెండేళ్లుగా ఇళ్ల వద్దే 23 వేల మంది
బీజింగ్: కొవిడ్ ఆంక్షల్లో భాగంగా గత రెండేళ్లుగా వీసాల జారీపై బీజింగ్ విధించిన నిషేధంతో భారత్లోని ఇళ్ల వద్దే ఉండిపోయిన దాదాపు 23 వేలమంది విద్యార్థులను త్వరలో మళ్లీ వెనక్కు రప్పిస్తామని భారత ప్రభుత్వానికి చైనా హామీ ఇచ్చింది. భారత విద్యార్థులపై తమకెలాంటి వివక్ష లేదని, ఇది రాజకీయ అంశం కానేకాదని స్పష్టం చేసింది. చైనాలోని వివిధ కళాశాలల్లో భారత్కు చెందిన పలువురు విద్యార్థులు ఎక్కువగా వైద్యవిద్య అభ్యసిస్తున్నారు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబార కార్యాలయానికి హామీ ఇస్తూ.. విదేశీ విద్యార్థుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత ఎంబసీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఇటీవల బీజింగులో పర్యటించినపుడు కూడా చైనా నుంచి ఇదేవిధమైన హామీ పొందారు. పాక్ విద్యార్థులు 28 వేలకు పైగా చైనాలో చదువుతున్నారు. ఇతర దేశాలకు కూడా ఇలాంటి హామీలే ఇచ్చిన చైనా విద్యార్థులు మళ్లీ వెనక్కు ఎప్పుడు రావాలన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!