Imran Khan: ఇమ్రాన్ మెడకు విచారణ ఉచ్చు
‘వేధింపుల రాజకీయాలు ఉండవు.. చట్టం మటుకు తన పని తాను చేసుకుపోతుంది’.. రాజకీయాల్లో అత్యున్నత పీఠాలు అధిరోహించే ముందు అందరూ చెప్పే ఈ మాటలే ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్
బహుమతిగా అందిన రూ.18 కోట్ల కంఠహారం విక్రయంపై దర్యాప్తు
ఇస్లామాబాద్: ‘వేధింపుల రాజకీయాలు ఉండవు.. చట్టం మటుకు తన పని తాను చేసుకుపోతుంది’.. రాజకీయాల్లో అత్యున్నత పీఠాలు అధిరోహించే ముందు అందరూ చెప్పే ఈ మాటలే ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా చెప్పారు. ఆయన ప్రమాణస్వీకారం చేసి మూడు రోజులు తిరక్కముందే చట్టం శరవేగంగా తన పని మొదలుపెట్టింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ తన ప్రభుత్వ హయాంలో బహుమతిగా అందిన కంఠహారాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా రూ.18 కోట్ల మొత్తానికి ఓ నగల వ్యాపారికి విక్రయించారన్నది అభియోగం. ఇమ్రాన్ ఈ ఆభరణాన్ని తన మాజీ సహాయకుడైన జుల్ఫికర్ బుఖారీకి ఇచ్చి లాహోర్లోని నగల దుకాణంలో విక్రయించారంటూ ‘ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దేశ అత్యున్నత విచారణ సంస్థ ‘ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ’ (ఎఫ్ఐఏ) దీనిపై వెంటనే దర్యాప్తు ప్రారంభించింది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ తన సారథ్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులపై మూకుమ్మడి రాజీనామాలకు ఒత్తిడి తెస్తున్నారని పీఎంఎల్-ఎన్ నేత అయాజ్ సాధిఖ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత షెర్రి రెహమాన్ ఆరోపించారు. సభ్యుల అంగీకారంతో నిమిత్తం లేకుండా ఇలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
కేబినెట్లో చేరికపై 2 పార్టీల విముఖత
8 రాజకీయ పార్టీలు, మరో నలుగురు స్వతంత్ర సభ్యుల కూటమిగా ఏర్పడిన పాక్ సంకీర్ణ ప్రభుత్వం కేబినెట్ కూర్పు కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పాలక కూటమిలోని రెండో పెద్ద పార్టీ ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ’ (పీపీపీ) కేబినెట్లో చేరడం కన్నా దేశాధ్యక్షుడు, స్పీకర్ వంటి రాజ్యాంగ పదవులపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. ఇలాగైతేనే తాము మొదటినుంచీ చెబుతున్న ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం సులువు అవుతుందన్నది పీపీపీ నేతల ఆలోచన. మరో భాగస్వామ్య పక్షమైన ఎంక్యూఎం-పాకిస్థాన్ కూడా కేబినెట్లో చేరేందుకు ససేమిరా అంటోంది.
నవాజ్ పాస్పోర్టు పునరుద్ధరణకు ఆదేశాలు
బ్రిటన్లో తల దాచుకొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తోపాటు మాజీ ఆర్థికమంత్రి ఇషాక్ దర్ల పాస్పోర్టులను పునరుద్ధరించాల్సిందిగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు పాక్ కొత్త ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే