జిన్పింగ్కు మూడోసారి అధ్యక్ష పదవి!
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మూడోసారి ఆ పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నేషనల్ కాంగ్రెస్లో ప్రతినిధిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్దినెలల్లో ఈ
కసరత్తు ప్రారంభం
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మూడోసారి ఆ పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐదేళ్లకోసారి జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) నేషనల్ కాంగ్రెస్లో ప్రతినిధిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్దినెలల్లో ఈ జాతీయ సదస్సు జరిగే వీలుంది. మూడోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టడానికి జిన్పింగ్కు ఈ కార్యక్రమంలో లాంఛనంగా ఆమోదముద్ర పడే అవకాశం ఉంది. నిజానికి ఈ సదస్సు ఈ ఏడాది నవంబరులో జరగాల్సింది. కొవిడ్-19 సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు జరపాలని సీపీసీ నిర్ణయించింది.
2012లో జరిగిన సీపీసీ కాంగ్రెస్లో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి జిన్పింగ్.. పార్టీ, శక్తిమంతమైన సైనిక కమిషన్కు నేతృత్వం వహించడంతోపాటు అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తద్వారా, అధికారంపై పట్టు బిగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలోను, దేశంలోను సుస్థిరత నెలకొనేలా చూడటానికి పటిష్ఠ నాయకత్వం అవసరమని ఆయన వాదిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్తో సమానంగా ఆయన ఇప్పటికే ‘కోర్’ నాయకుడిగా ఎన్నికయ్యారు. జిన్పింగ్ పదేళ్ల పదవీ కాలం ఈ ఏడాదితో ముగుస్తుంది. ఆయనకు ముందున్న అధ్యక్షులు (మావో మినహా) గరిష్ఠంగా పదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. ‘కోర్’ నాయకుడి హోదా దృష్ట్యా మరో ఐదేళ్ల పాటు జిన్పింగ్ అధికారంలో కొనసాగడానికి వీలవుతోంది. జీవితకాలం పాటు ఆయన పదవిలో కొనసాగుతారన్న విశ్లేషణలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు