Ukraine Crisis: పాఠశాల భవంతిపై రష్యా దాడి
దాడుల భయంతో ప్రజలు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై రష్యా సైనికులు బాంబులు వేయడంతో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆ భవంతిలో దాదాపు 90 మంది ఉన్నారు. డాన్బాస్ ప్రాంతంలోని బిలోహొరివ్కాలో ఉన్న ఈ పాఠశాలపై బాంబులు పడడంతోనే మంటలు అంటుకున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ హైదై తెలిపారు. ‘అత్యవసర బలగాలు రెండు మృతదేహాలను గుర్తించి 30 మందిని రక్షించాయి.
అందులో తలదాచుకున్న 60 మంది మృతి!
ఎదురుదాడులు చేస్తున్న ఉక్రెయిన్
మరింత భారీ సాయానికి బోరిస్ జాన్సన్ భరోసా
అజోవ్స్తల్ వద్ద ఆఖరి పోరాటం చేస్తున్న ఉక్రెయిన్
కీవ్: దాడుల భయంతో ప్రజలు తలదాచుకున్న ఓ పాఠశాల భవనంపై రష్యా సైనికులు బాంబులు వేయడంతో సుమారు 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆ భవంతిలో దాదాపు 90 మంది ఉన్నారు. డాన్బాస్ ప్రాంతంలోని బిలోహొరివ్కాలో ఉన్న ఈ పాఠశాలపై బాంబులు పడడంతోనే మంటలు అంటుకున్నాయని లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ హైదై తెలిపారు. ‘అత్యవసర బలగాలు రెండు మృతదేహాలను గుర్తించి 30 మందిని రక్షించాయి. శిథిలాల కింద ఉన్న దాదాపు 60 మంది చనిపోయే ఉంటారు’ అని తెలిపారు. అక్కడకు సమీపంలోని మరోపట్టణంపై జరిగిన దాడిలో ఇద్దరు బాలురు చనిపోయారని చెప్పారు. తాము గుప్పిట పట్టిన మేరియుపొల్ను పూర్తిగా స్వాధీనం చేసుకొనేందుకు రష్యా సైనికులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడి అజోవ్స్తల్ ఉక్కు కర్మాగార ప్రాంగణం మినహా మిగిలిన ప్రాంతమంతా తమ చేతిలోనే ఉందని వారు ప్రకటించారు. ఆ కర్మాగార ప్రాంగణంలో ఉన్న సాధారణ ప్రజల తరలింపు శనివారమే పూర్తయింది. అక్కడి బంకర్లలో ఉన్న దాదాపు 2,000 మంది ఉక్రెయిన్ సైనికులు మాత్రం లొంగుబాటుకు సిద్ధంగా లేరు. ఆఖరిపోరాటం సాగిస్తున్నారు. ఈ స్థలాన్ని పదాతిదళాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు చుట్టుముట్టాయని, నిరంతరం గుళ్ల వర్షం కురుస్తూనే ఉందని అజోవ్ రెజిమెంట్ డిప్యూటీ కమాండర్ కెప్టెన్ పలమర్ చెప్పారు. సువిశాల ప్రాంగణంలో పౌరులు, సైనికులు పెద్దసంఖ్యలో చనిపోయారని వెల్లడించారు. గాయపడిన వారిని, వైద్య సిబ్బందిని సురక్షితంగా తరలించడంపై దృష్టి సారించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
ఒడెసాపై క్షిపణి దాడి
ఉక్రెయిన్ తీర ప్రాంతాలపై రష్యా దాడులు ఎడాపెడా కొనసాగాయి. నల్ల సముద్ర తీరంలో ప్రధాన ఓడరేవు అయిన ఒడెసాపై ఆదివారం క్షిపణులు విరుచుకుపడ్డాయి. కనీసం ఐదుసార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. గత పది వారాల్లో ఈ నగరంపై ఇంత తీవ్రంగా దాడులు జరగలేదు. దాడిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం ఏ మేరకు ఉందనేది అధికార వర్గాలు వెల్లడించలేదు. బహుళ అంతస్తుల భవనాలు ఘోరంగా దెబ్బతిన్నట్లు మాత్రం ఒడెసా నగరపాలక మండలి తెలిపింది. ‘స్నేక్ ఐలాండ్’లోని రష్యా స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఒక హెలికాప్టర్ను కూడా డ్రోన్ సాయంతో ఉక్రెయిన్ కూల్చివేసింది. ఖర్కివ్ సమీపంలో పోరు కొనసాగిస్తున్న ఉక్రెయిన్ నెమ్మదిగా రష్యా సరిహద్దు వైపు ముందడుగు వేయనుందని వాషింగ్టన్కు చెందిన ‘యుద్ధ అధ్యయన సంస్థ’ అంచనా వేసింది. ఖర్కివ్ సమీపంలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజల వాహనశ్రేణిపై ఇటీవల జరిగిన దాడిలో పలువురు చనిపోయిన విషయం వెలుగుచూసింది.
మరింత సాయాన్ని ఖాయం చేసిన బ్రిటన్
లండన్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్కు 130 కోట్ల పౌండ్ల (సుమారు రూ.12,345 కోట్లు) విలువైన సైనిక సాయాన్ని అదనంగా అందించనున్నట్లు బ్రిటన్ ధ్రువీకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, జి-7 దేశాలకు చెందిన ఇతర నేతలతో ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆన్లైన్లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జాన్సన్ తాను ఇదివరకే ప్రకటన చేసిన విషయాన్ని పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్కే కాకుండా ఐరోపా భద్రతకు రష్యా సవాల్ విసురుతోందన్నారు. అందువల్ల ఉక్రెయిన్కు బాసటగా నిలుస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?