పాంగాంగ్ సరస్సుపై చైనా మరో అక్రమ వంతెన
వాస్తవాధీనరేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భారీ కుట్రకు తెరలేపింది. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై మరో అక్రమ వంతెన నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ఈ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలను
మరింత భారీగా.. వెడల్పుగా..
తొలి వారధిని ఆనుకొనే నిర్మాణం
భారీ సైనిక వాహనాల తరలింపే లక్ష్యం
తాజా ఉపగ్రహచిత్రాల్లో వెల్లడి
దిల్లీ: వాస్తవాధీనరేఖ(ఎల్ఏసీ) వెంబడి చైనా భారీ కుట్రకు తెరలేపింది. తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్ సరస్సుపై మరో అక్రమ వంతెన నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ఈ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ గత ఏడాది చివర్లో వారధి నిర్మాణం ప్రారంభించి.. ఏప్రిల్లో పూర్తి చేసింది. ఇప్పుడు దీన్ని ఆనుకొనే మరింత భారీగా, వెడల్పుగా అత్యంత బరువున్న సైనిక వాహనాలను, భారీ స్థాయిలో దళాలను వేగంగా తరలించేందుకు కొత్త వంతెన నిర్మిస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భారీ క్రేన్లను నిలిపేందుకు, ఇతర నిర్మాణ ఉపకరణాల కోసం తొలి వారధిని ఉపయోగించుకోనుంది. ఈ తాజా పరిణామంపై భారత్ సైన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కొత్త వంతెన నిర్మాణ ఉపగ్రహ చిత్రాలను జియో స్పేసియస్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సిమోన్ ట్విటర్లో విడుదల చేశారు. ఎల్ఎసీ పొడుగునా చైనా కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నిఘా ఉంచే సిమోనే.. తొలి వారధి విషయాన్ని కూడా బయటి ప్రపంచానికి వెల్లడించారు.
ఎందుకు నిర్మిస్తోందంటే...
2020లో తూర్పు లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథస్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించింది. ఆ సమయంలో గల్వాన్లో ఇరు సైన్యాలు ముఖాముఖి తలపడ్డాయి. తర్వాత అదే ఏడాది ఆగస్టులో గల్వాన్ ఘర్షణకు ప్రతీకారంగా భారత్ మెరుపువేగంతో పాంగాంగ్ దక్షిణ భాగంలోని కీలక పర్వతాలను చేజిక్కించుకుంది. ఈ ఊహించని పరిణామానికి నివ్వెరపోయిన డ్రాగన్.. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా.. గత ఏడాది తేలిక పాటి వాహనాలు వెళ్లేందుకు వీలుగా సరస్సుపై ప్రి ఫాబ్రికేటెడ్ పరికరాలతో వారధి కట్టింది. దీంతో పాంగాంగ్ ఉత్తరభాగంలోని ఖుర్నాక్ నుంచి దక్షిణ భాగమైన రుటోక్ మధ్య దూరం భారీగా తగ్గింది. గతంలో ఖుర్నాక్ నుంచి రుటోక్ చేరాలంటే చైనా సైన్యం దాదాపు 180 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఏప్రిల్లో ముగిసిన తొలి వారధితో అది 40 నుంచి 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. ఇప్పుడు ఈ రెండో వంతెనతో భారీ స్థాయిలో బలగాలను అత్యంత వేగంగా దక్షిణ భాగానికి తరలించే వీలు చైనాకు కలుగుతుంది. ఇది పూర్తయితే పాంగాంగ్ సరస్సులోని దక్షిణ ప్రాంతంలోని పర్వతాలను చేజిక్కించుకోవడం భవిష్యత్తులో భారత్కు కష్టమయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు