Cancer: 18 మంది క్యాన్సర్ రోగులకు.. సంపూర్ణ స్వస్థత!
క్యాన్సర్ పరిశోధనల్లో మరో సంచలనం! ఒక్క ఔషధంతో... 18 మంది పురీషనాళ క్యాన్సర్ బాధితులు సంపూర్ణ స్వస్థత పొందారు. ఇక వారికి తదుపరి చికిత్స కూడా అవసరం లేదని, ఈ ఫలితాన్ని తాము కూడా ఊహించలేదని
ఫలించిన ప్రయోగాత్మక చికిత్స
అమెరికా శాస్త్రవేత్తల ఘనత
న్యూయార్క్: క్యాన్సర్ పరిశోధనల్లో మరో సంచలనం! ఒక్క ఔషధంతో... 18 మంది పురీషనాళ క్యాన్సర్ బాధితులు సంపూర్ణ స్వస్థత పొందారు. ఇక వారికి తదుపరి చికిత్స కూడా అవసరం లేదని, ఈ ఫలితాన్ని తాము కూడా ఊహించలేదని పరిశోధకులు ప్రకటించారు. ఒక్క ఔషధ చికిత్సతో బాధితులు సంపూర్ణ స్వస్థత పొందడం బహుశా క్యాన్సర్ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చని వారు పేర్కొన్నారు.
ఎలా చేశారంటే...
పురీషనాళ (రెక్టల్) క్యాన్సర్... మలద్వారం వద్ద పెద్దపేగు కలిసే చోటు నుంచి ఏర్పడుతుంది. ఇలాంటి బాధితుల్లో కీమో, రేడియేషన్ థెరపీతో పాటు పేగు, మూత్రసంబంధ శస్త్రచికిత్సలు చేయించుకున్న 18 మంది... ఇక తమకు చావే శరణ్యమని భావించారు. వీరిలో కొందరికి జీర్ణ వ్యవస్థ నుంచి మలాన్ని సేకరించే కొలోస్టమీ బ్యాగులు కూడా ఉన్నాయి. అయితే- ‘మెమోరియల్ స్లోన్ కెటెరింగ్ క్యాన్సర్ సెంటర్’ పరిశోధకులు వీరిపై ప్రత్యేక దృష్టి సారించారు. డా.ఆండ్రియా సెర్సెక్ బృందం వీరందరికీ ప్రయోగాత్మకంగా ప్రత్యేక చికిత్స ఆరంభించింది. మూడు వారాలకు ఒకసారి చొప్పున... వరుసగా 6 నెలల పాటు ‘డోస్టార్లిమాబ్’ అనే ఔషధాన్ని ఇచ్చింది. తర్వాత పరీక్షలు నిర్వహించగా... వీరంతా క్యాన్సర్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు గుర్తించారు. ‘‘క్యాన్సర్ చరిత్రలోనే తొలిసారిగా 18 మంది పురీషనాళ క్యాన్సర్ పీడితులు ఆ రుగ్మత నుంచి సంపూర్ణంగా స్వస్థత పొందారు. చికిత్స పొందిన ప్రతి ఒక్కరిలోనూ ఇదే ఫలితం కనిపించడంతో ఆనందంతో మా కళ్లు చెమ్మగిల్లాయి’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది?
‘డోస్టార్లిమాబ్’లో... మనిషి శరీరంలోని యాంటీబాడీల మాదిరి పనిచేసే ప్రతినిరోధకాలు ఉంటాయి. ఇవన్నీ ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసినవే. మొదట ఇవి క్యానర్ కణాలను బద్ధలు కొడతాయి. తర్వాత వీటిని గుర్తించి, అంతంచేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. చికిత్స సమయంలో రోగులెవరికీ తీవ్రస్థాయి అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదని పరిశోధకులు వివరించారు. ఈ ఔషధం పనితీరును మరింత కచ్చితంగా నిర్ధారించుకునేందుకు విస్తృత స్థాయిలో ప్రయోగాత్మక పరీక్షలు చేపట్టాల్సి ఉందని పరిశోధనలో పాలుపంచుకున్న డా.వెనూక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు