నార్వేలో ఉగ్ర దాడి!

నార్వే రాజధాని ఓస్లోలో సాయుధ దుండగుడు(42) జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఇరాన్‌ జాతీయుడైన నార్వే పౌరుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్వలింగ సంపర్కుల సమూహం(ఎల్జీబీటీక్యూ) ప్రదర్శనకు సన్నాహాలు చేసుకుంటున్న నైట్‌ క్లబ్‌ వద్ద, నగరంలోని మరో రెండు

Published : 26 Jun 2022 05:17 IST

దుండగుడి కాల్పుల్లో ఇద్దరి మృతి, 20 మందికి గాయాలు

ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలో సాయుధ దుండగుడు(42) జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఇరాన్‌ జాతీయుడైన నార్వే పౌరుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్వలింగ సంపర్కుల సమూహం(ఎల్జీబీటీక్యూ) ప్రదర్శనకు సన్నాహాలు చేసుకుంటున్న నైట్‌ క్లబ్‌ వద్ద, నగరంలోని మరో రెండు చోట్ల నిందితుడు కాల్పులకు తెగించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు జరిపిన ఉగ్రదాడి కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడు ఏ లక్ష్యంతో ఈ దాడికి పాల్పడ్డాడు, అతని వెనుక ఎవరున్నారో నిర్ధరించుకునే యత్నంలో పోలీసులున్నారు. దుండగుడి మానసిక ఆరోగ్య పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని