షాపింగ్ మాల్పై రష్యా క్షిపణి దాడి
జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ.. ఉక్రెయిన్పై రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై విరుచుకుపడింది పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్చుక్ నగరంలో భారీ జనసందోహం ఉన్న షాపింగ్ మాల్పై సోమవారం క్షిపణులతో దాడిచేసింది.
ఆ సమయంలో అందులో 1000కుపైగా పౌరులు!
10 మంది మృతి, 40 మందికి గాయాలు
స్లొవియాన్స్క్/బ్రసెల్స్: జీ7 దేశాల అధినేతల భేటీ జరుగుతున్న వేళ.. ఉక్రెయిన్పై రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. రాజధాని కీవ్ సహా పలు నగరాలపై విరుచుకుపడింది పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్చుక్ నగరంలో భారీ జనసందోహం ఉన్న షాపింగ్ మాల్పై సోమవారం క్షిపణులతో దాడిచేసింది. ఆ సమయంలో 1000కు పైగా పౌరులు వాణిజ్య సముదాయంలో ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. మృతుల సంఖ్యను ఊహించడం కూడా అసాధ్యమని అన్నారు. అయితే 10 మంది పౌరులు మృతి చెందారని, 40 మందికి పైగా గాయాలయ్యాయని, ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య ఇంకా భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం రెండు క్షిపణులు షాపింగ్ మాల్ను తాకాయి. ఆ సమయంలో మాల్ నుంచి పౌరులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆకాశన్నంటేలా మంటలు ఎగసిపడ్డాయి. వాణిజ్య సముదాయంపై దాడిని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా ఖండించారు. పుతిన్ క్రూరత్వానికి, అనాగరికతకు.. ఈ సంఘటన ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రష్యాకు ఏ మాత్రం మానవత్వం లేదని, సైనిక ప్రాంతానికి ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతంపై దాడి చేయడం అమానవీయమని జెలెన్స్కీ మండిపడ్డారు. ఓవైపు రాజధాని కీవ్పై దాడులు చేస్తూనే.. లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ చేతిలో మిగిలిన ఏకైక నగరమైన లీసీచాన్స్క్ ముట్టడి కార్యక్రమాన్ని రష్యా వేగవంతం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు