కొవిడ్-19 రోగులకు తీవ్రమైన నరాల క్షీణత రుగ్మత ముప్పు
ఇతరులతో పోలిస్తే కొవిడ్-19 బాధితులకు నరాల క్షీణత రుగ్మతల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా పాజిటివ్గా తేలిన వారు అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇస్కెమిక్ స్ట్రోక్ వంటి రోగాల
లండన్: ఇతరులతో పోలిస్తే కొవిడ్-19 బాధితులకు నరాల క్షీణత రుగ్మతల ముప్పు అధికమని ఓ అధ్యయనంలో తేలింది. కరోనా పాజిటివ్గా తేలిన వారు అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇస్కెమిక్ స్ట్రోక్ వంటి రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువని అధ్యయనకర్తలు గుర్తించారు. ఆస్ట్రియారాజధాని వియన్నాలో ఆదివారం జరిగిన 8వ యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సమావేశంలో ఈ తాజా అధ్యయనాన్ని సమర్పించారు. అందులోని వివరాల మేరకు 9,19,731 మందికి కొవిడ్-19 పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా తేలిన 43,375 మందికి అల్జీమర్స్ ముప్పు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వారికి పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు 2.6 రెట్లు, ఇస్కెమిక్ స్ట్రోక్ ముప్పు 2.7 రెట్లు, మెదడులో రక్తస్రావం ముప్పు 4.8 రెట్లు ఎక్కువని తేల్చారు. ఇటువంటి నరాల క్షీణత రుగ్మతలు పెరగడానికి న్యూరో ఇన్ఫ్లమేషన్ దోహదం చేస్తుండవచ్చని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్