చందమామ రేసులో దక్షిణ కొరియా
చందమామ దిశగా దేశాలు వరుసకడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణ కొరియా చేరింది. జాబిల్లి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్ను పంపింది. భవిష్యత్లో చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది
తొలి వ్యోమనౌక ప్రయోగం
కేప్ కెనావెరాల్: చందమామ దిశగా దేశాలు వరుసకడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణ కొరియా చేరింది. జాబిల్లి కక్ష్యలోకి ఒక ఆర్బిటర్ను పంపింది. భవిష్యత్లో చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌకలను దించడానికి అనువైన ప్రదేశాలను ఇది గుర్తిస్తుంది. ‘దనురి’ అనే ఈ ఆర్బిటర్ను స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన రాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. ఇది డిసెంబరులో జాబిల్లిని చేరుతుంది. 18 కోట్ల డాలర్లతో దక్షిణ కొరియా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దనురి.. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి చేరుతుంది. ఏడాది పాటు చందమామను శోధిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ కొరియా.. ఈ ఏడాది జూన్లో సొంత రాకెట్తో భూ కక్ష్యలోకి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రుడిని భారత్, అమెరికా, చైనాల వ్యోమనౌకలు శోధిస్తున్నాయి. త్వరలో రష్యా, జపాన్, అమెరికాలోని పలు ప్రైవేటు కంపెనీలు మరికొన్ని ఉపగ్రహాలను అక్కడికి పంపబోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు