కృత్రిమ మేధతో సూక్ష్మరోబోల ఈత
ఈతకొట్టే సూక్ష్మ రోబోల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఇందుకోసం వారు డీప్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రక్రియను ఉపయోగించారు. ఈ రోబోలతో వైద్యరంగంలో అనేక
వాషింగ్టన్: ఈతకొట్టే సూక్ష్మ రోబోల తయారీ దిశగా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. ఇందుకోసం వారు డీప్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ప్రక్రియను ఉపయోగించారు. ఈ రోబోలతో వైద్యరంగంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అమెరికా, హాంకాంగ్ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులకు ఇలాంటి ఈత సామర్థ్యం ఉంటుంది. తద్వారా అవి నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటాయి. ఇదే సామర్థ్యం కలిగిన కృత్రిమ సూక్ష్మరోబోల అవసరం ఇప్పుడు ఏర్పడింది. శరీరంలో నిర్దేశిత ప్రదేశానికి ఔషధాన్ని చేరవేయడానికి, మైక్రో సర్జరీకి అవి ఉపయోగపడతాయి. కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా వీటిని సాకారం చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. వివిధ దిశల్లోకి ఈత కొట్టుకుంటూ వెళ్లడం కోసం తాజా సూక్ష్మరోబోలు తమ ‘శరీర భాగాల’ను కదిలించడంపై కసరత్తు చేశాయి. ఇందుకోసం మానవ విజ్ఞానాన్ని కాకుండా మెషీన్ లెర్నింగ్ అల్గోరిథమ్ను ఉపయోగించుకున్నాయి. వెళ్లాల్సిన దిక్కుకు అనుగుణంగా తమ కదలిక విధానాన్ని మార్చుకున్నాయి. వెలుపలి ద్రవ ప్రవాహాల్లో మార్పులకు తగ్గట్టు ఈత పద్ధతిని సర్దుబాటు చేసుకున్నాయి. సంక్లిష్టమైన వాతావరణాల్లో స్వతంత్రంగా గమ్యానికి చేరుకోగలిగే మైక్రోరోబోల అభివృద్ధి దిశగా ఇది తొలి అడుగు అని శాస్త్రవేత్తలు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం