నిన్న మద్దతిచ్చి.. నేడు రూటు మార్చి!
బ్రిటన్లో ప్రధాని పదవికి జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ పదవికి రిషి సునాక్, లిజ్ ట్రస్లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఇంతవరకు సునాక్కు మద్దతుగా నిలిచిన సీనియర్ కేబినెట్ మంత్రి రాబర్ట్ బక్లాండ్ రూటు మార్చి ప్రత్యర్థి ట్రస్ శిబిరం వైపు వెళ్లారు. ‘‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సరైన వ్యక్తి ట్రస్ అని ఇప్పుడు
సునాక్ నుంచి ట్రస్ శిబిరానికి బ్రిటన్ సీనియర్ మంత్రి
లండన్: బ్రిటన్లో ప్రధాని పదవికి జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ పదవికి రిషి సునాక్, లిజ్ ట్రస్లు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఇంతవరకు సునాక్కు మద్దతుగా నిలిచిన సీనియర్ కేబినెట్ మంత్రి రాబర్ట్ బక్లాండ్ రూటు మార్చి ప్రత్యర్థి ట్రస్ శిబిరం వైపు వెళ్లారు. ‘‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సరైన వ్యక్తి ట్రస్ అని ఇప్పుడు నేను నమ్ముతున్నాను’’ అని ఆయన ‘ది డైలీ టెలిగ్రాఫ్’లో పేర్కొన్నారు. ఆమె (ట్రస్) ప్రణాళికలు ఆర్థికరంగ అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ప్రారంభంలో తాను సునాక్కు మద్దతిచ్చానని, అయితే ఇద్దరు అభ్యర్థుల ప్రణాళికలను జాగ్రత్తగా విన్న తర్వాత ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిపారు. ఇలా మనసు మార్చుకోవడం అంత సులువు కాదనీ చెప్పుకొచ్చారు. ‘‘ఇద్దరు అభ్యర్థులూ మంచివాళ్లే. వారితో నేను కేబినెట్లో కలిసి పనిచేశాను. అయితే నేను భావజాలం, సిద్ధాంతాలకే తొలి ప్రాధాన్యం ఇస్తాను. వ్యక్తిత్వాలు అనేది రెండో అంశమే..’’ అని పేర్కొన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం రాబర్ట్ బక్లాండ్ ఇందుకు విరుద్ధంగా మాట్లాడారు. ‘‘గట్టి నాయకత్వం రావాల్సిన సమయమిది. అందుకే నేను రిషి సునాక్కు మద్దతివ్వడానికి గర్వపడుతున్నాను’’ అని అప్పట్లో పేర్కొనడం గమనార్హం. కాగా ఉప ప్రధానమంత్రి డొమినిక్ రాబ్ మాత్రం సునాక్కు గట్టిగా మద్దతిస్తున్నారు. ‘‘ట్రస్ ప్రణాళికలు దేశానికి విశ్వసనీయమైనవి కావు. అనేక అంశాలపై ఆమెది గందరగోళ పరిస్థితి. సునాక్కు మాత్రం స్పష్టమైన దార్శనికత, స్థిరత్వం ఉన్నాయి. సవాళ్ల పట్ల స్పష్టత ఉన్న ప్రధాని అవసరం మనకు ఉంది’’ అని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM