చైనాకు మళ్లీ షాక్‌.. తైవాన్‌లో మరో అమెరికా బృందం

చైనా, తైవాన్‌ వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బృందం పర్యటన రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే.. అయిదుగురు అమెరికా చట్టసభ సభ్యుల మరో బృందం   తైవాన్‌ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న

Published : 15 Aug 2022 06:08 IST

తైపీ: చైనా, తైవాన్‌ వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బృందం పర్యటన రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే.. అయిదుగురు అమెరికా చట్టసభ సభ్యుల మరో బృందం   తైవాన్‌ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న సేన్‌.ఎడ్‌ మార్కీ నేతృత్వంలోని ఈ బృందం ప్రస్తుతం తైవాన్‌లో ఉంది. తైపీలోని అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ బృందం తైవాన్‌ ఉన్నతాధికారులను కలిసి.. అమెరికా - తైవాన్‌ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇతర అంశాలపై చర్చిస్తుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని