హంబన్టోటకు చేరిన చైనా నిఘా నౌక
భారత్, శ్రీలంక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్న పరిణామమొకటి తాజాగా చోటుచేసుకుంది. మన దేశంతో పాటు అమెరికా వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అత్యాధునిక నిఘా నౌక ‘యువాన్
కొలంబో: భారత్, శ్రీలంక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశమున్న పరిణామమొకటి తాజాగా చోటుచేసుకుంది. మన దేశంతో పాటు అమెరికా వ్యక్తం చేసిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చైనాకు చెందిన అత్యాధునిక నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’ లంకలోని హంబన్టోట ఓడరేవుకు మంగళవారం ఉదయం చేరుకుంది. ఈ నెల 22 వరకు అది అక్కడే మకాం వేయనుంది. ‘యువాన్ వాంగ్ 5’పై రెండు వేల మందికి పైగా సిబ్బంది ఉంటారు. 750 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై సైతం గగనతల నిఘా ఉంచగల సామర్థ్యం దాని సొంతం. ప్రధానంగా ఉపగ్రహాలు, బాలిస్టిక్ క్షిపణుల కదలికలను అది పసిగట్టగలదు. ఈ నెల 11నే ఆ నౌకను హంబన్టోటకు చేర్చాలని.. అక్కడ కొన్ని రోజులు ఉంచాలని చైనా భావించింది. ఇంధనాన్ని నింపుకోవడం సహా మరికొన్ని సాధారణ కార్యకలాపాల కోసమే ఆ ఓడరేవుకు తరలిస్తున్నట్లు పేర్కొంది. అందుకు భారత్, అమెరికాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అత్యాధునిక నిఘా వ్యవస్థలతో కూడిన నౌక హంబన్టోటకు వెళ్లే దారిలో.. తమ రక్షణ వ్యవస్థలపై నిఘా వేసే ముప్పుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?