24 గంటల్లో 12,800 కిలోమీటర్ల ప్రయాణం
తైవాన్ వ్యవహారంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నవేళ జర్మనీ తమ వాయుసేన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది! తమ దేశానికి చెందిన యూరోఫైటర్ యుద్ధ విమానాల బృందాన్ని సింగపూర్కు తాజాగా పంపించింది. కేవలం 24 గంటల వ్యవధిలో అవి
సింగపూర్కు యుద్ధవిమానాలను పంపిన జర్మనీ
బ్యాంకాక్: తైవాన్ వ్యవహారంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నవేళ జర్మనీ తమ వాయుసేన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించింది! తమ దేశానికి చెందిన యూరోఫైటర్ యుద్ధ విమానాల బృందాన్ని సింగపూర్కు తాజాగా పంపించింది. కేవలం 24 గంటల వ్యవధిలో అవి ఏకంగా 12,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అవసరమైన సందర్భాల్లో తక్కువ సమయంలోనే ఆసియాకు యుద్ధ విమానాలను పంపించగల సత్తా తమకుందని.. అమెరికా మిత్రపక్షమైన జర్మనీ ఈ పరిణామంతో చాటుకున్నట్లయింది. అయితే- సింగపూర్ వైపుగా బయలుదేరిన ఆరు యుద్ధ విమానాల్లో ఒకటి సాంకేతిక సమస్యలతో యూఏఈలో నిలిచిపోయింది. సింగపూర్ నుంచి జర్మనీ యూరోఫైటర్లు ఆస్ట్రేలియా చేరుకుంటాయి. అక్కడ భారత్, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాల బలగాలతో కలిసి.. ఈ నెల 19 నుంచి సెప్టెంబరు 8 వరకు నిర్వహించనున్న ‘పిచ్ బ్లాక్’ విన్యాసాల్లో పాల్గొంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్