24న మళ్లీ శ్రీలంకకు గొటబాయ!

ప్రజాందోళనతో దేశం విడిచి, గత నెల రోజులకు పైగా విదేశాల్లో తల దాచుకొంటున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మళ్లీ స్వదేశానికి తిరిగిరానున్నారు. ఈ నెల 24న ఆయన తిరిగి

Published : 18 Aug 2022 05:47 IST

కొలంబో: ప్రజాందోళనతో దేశం విడిచి, గత నెల రోజులకు పైగా విదేశాల్లో తల దాచుకొంటున్న శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మళ్లీ స్వదేశానికి తిరిగిరానున్నారు. ఈ నెల 24న ఆయన తిరిగి వస్తారని గొటబాయకు సోదరుడి వరసైన ఉదయంగ వీరతుంగ బుధవారం వెల్లడించారు. ‘ఆయన నాతో ఫోనులో మాట్లాడారు. వచ్చేవారం ఇక్కడికి వస్తారు’ అని తెలిపారు. వీరతుంగ 2006 - 15 మధ్యకాలంలో శ్రీలంక రాయబారిగా రష్యాలో పనిచేశారు. సింగపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఆగస్టు 11న బ్యాంకాక్‌ చేరిన గొటబాయ భద్రత కారణాల రీత్యా హోటల్‌ గదుల్లోనే ఉంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని