జాన్సన్ కొనసాగింపునకే ఎక్కువమంది మద్దతు!
బ్రిటన్ ప్రధాని పదవికి పాలక కన్జర్వేటివ్ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీలో... భారత సంతతికి చెందిన రిషి సునాక్ కన్నా విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తాజా యూగవ్ సర్వే తేల్చింది. ఇంతకుముందు
ప్రధాని రేసులో ఉండుంటే పీఠం మళ్లీ ఆయనదే
కన్జర్వేటివ్ పార్టీలో 46% మంది అభిప్రాయం ఇదే
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పాలక కన్జర్వేటివ్ అభ్యర్థుల మధ్య జరుగుతున్న పోటీలో... భారత సంతతికి చెందిన రిషి సునాక్ కన్నా విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తాజా యూగవ్ సర్వే తేల్చింది. ఇంతకుముందు కన్జర్వేటివ్ పార్టీ సొంతగా జరిపిన సర్వేలోనూ ట్రస్కు 32 పాయింట్ల ఆధిక్యతే లభించింది. ప్రధాని పదవికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఓటువేసే అర్హత ఉన్న 1,089 మంది పార్టీ సభ్యులతో ఈనెల 12-17 తేదీల మధ్య యూగవ్ సర్వే జరిగింది. కాగా, ప్రధాని పదవిలో బోరిస్ జాన్సనే కొనసాగాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువేం లేదు. స్కైన్యూస్ కోసం తాజాగా జరిగిన యూగవ్ సర్వేలో- జాన్సన్ రాజీనామా చేసేలా తమ ఎంపీలు ఒత్తిడి తేవడం సరికాదని 55% మంది పార్టీ సభ్యులు పేర్కొన్నారు. జాన్సన్ పోటీలో ఉంటే 46% మంది సభ్యులు ఆయనకు మద్దతు ఇచ్చి ఉండేవారని; ట్రస్ 24%, సునాక్ 23% ఓట్లతో సరిపెట్టుకోవలసి వచ్చేదని స్కైన్యూస్ వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ను ఓడించే సత్తా జాన్సన్కు మాత్రమే ఉందని అత్యధిక మంది కన్జర్వేటివ్ సభ్యులు భావిస్తున్నారు. ట్రస్ ప్రధాని అయితే మాత్రం హంగ్ రావడమో, లేబర్ పార్టీకి మెజారిటీ దక్కడమో జరుగుతుందని 40% మంది భావిస్తున్నారు. కాగా, తన ప్రత్యర్థి ట్రస్కు సభ్యుల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నా... తాను రేసులో కొనసాగడం ఉత్కంఠ భరితంగా ఉందని రిషి సునాక్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్