Sugar: అధిక చక్కెరతో పేగు బ్యాక్టీరియా అస్తవ్యస్తం
ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియా తీరుతెన్నులు మారిపోతాయని తాజా పరిశోధన పేర్కొంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని
ఊబకాయం, మధుమేహం నుంచి రక్షణ కనుమరుగు
వాషింగ్టన్: ఆహారంలో తీసుకునే అధిక చక్కెర వల్ల పేగుల్లోని ప్రయోజనకర బ్యాక్టీరియా తీరుతెన్నులు మారిపోతాయని తాజా పరిశోధన పేర్కొంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపింది. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. చక్కెర, కొవ్వు అధికంగా ఉండే పాశ్చాత్య ఆహారాన్ని ఇచ్చినప్పుడు ఆ జీవుల్లో బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత వంటి మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు ఉత్పన్నమయ్యాయి. వాటి పేగుల్లోని సూక్ష్మజీవుల సమతౌల్యంలోనూ మార్పులు వచ్చాయి. సెగ్మెంటెడ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా పరిమాణం బాగా తగ్గింది. టీహెచ్17 కణాలు క్షీణించాయి. జీవక్రియ వ్యాధులు, మధుమేహం, స్థూలకాయం నుంచి రక్షణకు ఈ కణాలు అవసరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్