షింజో అబెకు నేడు భారీగా తుది వీడ్కోలు
మాజీ ప్రధాని షింజో అబె (67)కు జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంగళవారం తుది వీడ్కోలు పలకనుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబె జులై 8న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకు
హాజరుకానున్న వందకుపైగా దేశాల ప్రతినిధులు
టోక్యో బయల్దేరిన మోదీ
దిల్లీ, టోక్యో: మాజీ ప్రధాని షింజో అబె (67)కు జపాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మంగళవారం తుది వీడ్కోలు పలకనుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న అబె జులై 8న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకు కుటుంబసభ్యులు ప్రైవేటుగా అంత్యక్రియలు నిర్వహించారు. జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన షింజో అబెకు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలకడం ముమ్మాటికీ సబబు అన్నది ప్రధాని ఫుమియో కిషిద వాదన. ఈ మేరకు రాజధాని నగరం టోక్యోలో భారీ ఏర్పాట్లు చేశారు. భారత్కు మంచి మిత్రుడిగా మెలిగిన అబెకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రాత్రి టోక్యోకు బయలుదేరారు. మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తదితర వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమం కోసం 18,000 మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టోక్యోలోని నిప్పాన్ బుడోకాన్ హాలులో దివంగత నేతకు పుష్పాంజలి ఘటించేందుకు ప్రజలను కూడా అనుమతిస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదతోపాటు షింజో అబె భార్య అకీతో భేటీ కానున్నారు.
వీడ్కోలు ఖర్చులపై నిరసనగా భారీ ప్రదర్శన
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు దాదాపు రూ.73.3 కోట్లు (9 మిలియన్ డాలర్లు) ఖర్చు చేసినట్లు అంచనా కాగా.. షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి ఏకంగా రూ.94.5 కోట్లు (11.6 మిలియన్ డాలర్లు) ఖర్చు పెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రజల పన్నులతో చేస్తున్న ఈ కార్యక్రమం రద్దు చేయాలని కోరుతూ సోమవారం సుమారు 10 వేల మంది టోక్యో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..