విద్యతోనే ఉత్తమ వ్యక్తిత్వం
‘‘అక్షరాస్యత అనేది విజ్ఞానానికి మొదలు లేదా ముగింపు కాదు. విద్యావిధానం ద్వారానే ఓ వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలు బయటకు తీసుకురాగలం’’ అంటూ భారత జాతిపిత మహాత్మాగాంధీ విద్యావ్యవస్థపై ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఐరాసలో మహాత్ముడి ప్రసంగం!
ఐక్యరాజ్యసమితి: ‘‘అక్షరాస్యత అనేది విజ్ఞానానికి మొదలు లేదా ముగింపు కాదు. విద్యావిధానం ద్వారానే ఓ వ్యక్తిలోని ఉత్తమమైన లక్షణాలు బయటకు తీసుకురాగలం’’ అంటూ భారత జాతిపిత మహాత్మాగాంధీ విద్యావ్యవస్థపై ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదేమిటీ.. ఐరాసకు జాతిపిత రావడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? అదే టెక్నాలజీ మాయ మరి. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఐరాసలో అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో.. సాంకేతికత పుణ్యమా అని గాంధీజీ ప్రత్యేక అతిథిగా కనిపించారు. కనిపించడమే కాదు.. విద్యపై తన అభిప్రాయాన్ని కూడా చెప్పారు. యునెస్కో మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎంజీఐఈపీ) 10వ వార్షికోత్సవాలను శుక్రవారం ఐరాసలో ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐరాస భారత ప్రతినిధి బృందం.. గాంధీజీ హోలోగ్రామ్ను ప్రదర్శించింది. ఈ హోలోగ్రామ్ను చూడగానే అచ్చంగా జాతిపితే సమావేశాలకు నడిచి వచ్చిన భావన కలిగింది. హోలోగ్రామ్కు ఉన్న వాయిస్ ఓవర్.. విద్యపై మహాత్ముడి అభిప్రాయాలను పంచుకుంది. ఆ మాటలు గాంధీ నోటి వెంటే వచ్చినట్లుగా వినిపించాయి. ఈ ప్యానెల్ చర్చలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్, ది కింగ్ సెంటర్ సీఈవో అట్లాంటా బెర్నిస్ కింగ్, డిజిటల్ విద్య యువ ప్రతినిధి అయిన ఇండోనేసియా రాకుమారి హయు పాల్గొన్నారు. అంతకుముందు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రసంగించారు. సమాజానికి గాంధీజీ జీవితం శాంతి, సహనంతో కూడిన మార్గం చూపిస్తుందన్నారు. మహాత్ముడి హోలోగ్రామ్ను హైదరాబాద్లోని మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియం రూపొందించింది. ఇది గాంధీజీ హోలోగ్రామ్లో రెండో ఎడిషన్ అని ఈ మ్యూజియం డైరెక్టర్ బిరాద్ యాజ్ఞిక్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ