ఈ-వ్యర్థాల్లో విషపూరిత పదార్థాలు

ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. వీటిలో ప్రింటర్లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, డిజిటల్‌ కెమెరాలు వంటివే ఎక్కువగా ఉంటున్నాయి.

Updated : 04 Oct 2022 06:15 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ

లక్ట్రానిక్‌ వ్యర్థాలు అంతకంతకూ పేరుకుపోతున్నాయి. వీటిలో ప్రింటర్లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, డిజిటల్‌ కెమెరాలు వంటివే ఎక్కువగా ఉంటున్నాయి. పర్యావరణానికి అత్యంత హానికర విషపూరిత పదార్థాలు వీటిల్లో ఉంటాయి. ఈ వ్యర్థాలను సరైన రీతిలో పునర్వినియోగించుకోవాలి.


నివాసయోగ్య ప్రాంతాలను విస్తరించాలి

ఆంటోనియో గుటెరస్‌

గరాల్లోని నివాస ప్రాంతాలు రానురాను ఇంకా రద్దీగా, ఇరుకుగా మారుతున్నాయి. వంద కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలు ఇరుకు వాడల్లో నివాసాలు ఉంటున్నారు. నివాసయోగ్య ప్రాంతాలను విస్తరించేందుకూ, వాటిని అభివృద్ధి చేసేందుకూ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.


ఉద్యోగాల కల్పనకు బాటలు

లిజ్‌ ట్రస్‌

బ్రిటన్‌లో చిన్న వ్యాపారాల నిర్వచనాన్ని మార్చుతున్నాం. వీటిలో పనిచేసే ఉద్యోగుల గరిష్ఠ సంఖ్యను 250 నుంచి 500కు పెంచుతున్నాం. తద్వారా 40 వేల సంస్థలకు లాభం చేకూరుతుంది. కొత్త నిర్ణయంతో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి, వేతనాలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత పురోగమిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని