అమెరికాలో భారతీయ కుటుంబం అపహరణ

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సెంట్రల్‌ వ్యాలీలో నివసిస్తున్న భారతీయ కుటుంబాన్ని ఓ దుండగుడు కిడ్నాప్‌ చేయడం కలకలం సృష్టించింది.

Published : 05 Oct 2022 06:13 IST

కిడ్నాపర్‌ చెరలో 8 నెలల చిన్నారి సహా తల్లిదండ్రులు

లాస్‌ ఏజెలిస్‌: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సెంట్రల్‌ వ్యాలీలో నివసిస్తున్న భారతీయ కుటుంబాన్ని ఓ దుండగుడు కిడ్నాప్‌ చేయడం కలకలం సృష్టించింది. జస్‌దీప్‌ సింగ్‌(36), జస్లీన్‌ కౌర్‌ (27) దంపతుల కుమార్తె ఎనిమిది నెలల ఆరూహీ ధేరీలతో పాటు జస్‌దీప్‌ బంధువు అమన్‌దీప్‌ సింగ్‌ (39)ను సోమవారం ఆగంతుకుడు కారులో అపహరించినట్లు మెర్సిడ్‌ కౌంటీ పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలు పర్యవేక్షించే స్థానిక న్యాయాధికారి వెర్న్‌ వాంకీ.. అనుమానితుడి రెండు ఫొటోలు విడుదల చేశారు. నిందితుడు ఆయుధాలు కలిగి ఉండొచ్చని, బాధితులకు ముప్పు తలపెట్టే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేశారు. కిడ్నాప్‌నకు కారణాలు ఇప్పుడే చెప్పలేమని, నిందితుడు సాక్ష్యాలు కూడా ధ్వంసం చేసే ప్రమాదముందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని