ఉక్రెయిన్తో చర్చలు జరపండి
ఉక్రెయిన్లో సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్నందున.. ఆ దేశంతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకు భారత్ మరోసారి సూచించింది.
రష్యాకు భారత్ సూచన
మాస్కో: ఉక్రెయిన్లో సంక్షోభం ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతున్నందున.. ఆ దేశంతో తిరిగి చర్చలు ప్రారంభించాలని రష్యాకు భారత్ మరోసారి సూచించింది. గత కొన్నేళ్లుగా కొవిడ్ మహమ్మారితో తీవ్ర సంక్షోభాలను చవిచూసిన ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడింది. ఉక్రెయిన్పై యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యాలో పర్యటిస్తోన్న భారత విదేశీవ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్.. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్తో మాస్కోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపైనా చర్చిస్తామని ఇరువురు నేతలు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై స్పందించిన జైశంకర్ తక్కువ ఆదాయ వనరులున్న భారత్ చౌక ధరలో లభ్యమయ్యే ఇంధన వనరులవైపు చూడక తప్పదన్నారు. ఈ క్రమంలో భారత్-రష్యాల బంధం తమకెంతో దోహదపడుతుందని.. దీన్ని మున్ముందు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించడంతోపాటు ముడిచమురు సేకరణను పెంచుతామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు