ఉగ్రవాదులకు అణ్వాయుధాలు అందరాదు
ఉగ్రవాదులు, నిషిద్ధ వ్యాపారుల చేతుల్లోకి అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలు వెళ్లకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
సభ్యదేశాలను కోరుతూ ఐరాస తీర్మానం
ఐరాస: ఉగ్రవాదులు, నిషిద్ధ వ్యాపారుల చేతుల్లోకి అణ్వాయుధాలు, రసాయన, జీవాయుధాలు వెళ్లకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సామూహిక జనహనన ఆయుధాలను ప్రభుత్వేతర సంస్థలు, వ్యక్తులు సేకరించకుండా, సరఫరా చేయకుండా నియంత్రించేంద]ుకు జరిగిన 2004 ఒప్పందాన్ని పర్యవేక్షించే కమిటీని 2032 నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు ఈ తీర్మానం స్పష్టం చేసింది. నిషేధిత ఆయుధాల వాడకాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగపడే అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విధానాలు సైతం తీవ్రవాదులు, ప్రభుత్వేతర సంస్థలకు అందకుండా చూడాల్సిన అవసరం ఉందంది. కమిటీలోని నిపుణుల బృందానికి తమ సహకారాన్ని కొనసాగిస్తామంది. భద్రతామండలి తీర్మానాన్ని అమెరికా, రష్యాలు స్వాగతించాయి.
రూ.4.18 లక్షల కోట్ల సాయానికి వినతి
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో పీడితులను ఆదుకోవడానికి రూ.4.18 లక్షల కోట్లను సాయంగా అందించాలని గురువారం ఐరాస తన సభ్యదేశాలను కోరింది. ఆఫ్రికాలో కరవు, పాకిస్థాన్లో వరదలు, ఉక్రెయిన్లో సంక్షోభంతోపాటు కరోనా మహమ్మారి కారణంగా 69 దేశాల్లో 33.9 కోట్ల మంది బాధితులయ్యారని తెలిపింది. వీరికి అండగా నిలిచేందుకు 2022లో చేసిన సాయానికి అదనంగా 25% పెంచాలని విన్నవించింది.
భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి డిసెంబరు నెల అధ్యక్ష బాధ్యతలు గురువారం భారత్కు దక్కాయి. ఈ క్రమంలో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రుచిరా కాంబోజ్ అధ్యక్ష స్థానంలో కూర్చుంటారు. 15 సభ్యదేశాలు గల మండలిలో ఒక్కో దేశానికి ఒక్కో నెల అధ్యక్ష స్థానాన్ని కట్టబెడతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే