అల్ఖైదా, పాక్ తాలిబన్పై అమెరికా కొరడా
అఫ్గానిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై అమెరికా కొరడా ఝుళిపించింది.
ఆ సంస్థలకు చెందిన నలుగురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై అమెరికా కొరడా ఝుళిపించింది. అల్ఖైదా, పాకిస్థాన్ తాలిబన్కు చెందిన నలుగురిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించింది. దీంతో అమెరికాలో వీరికి ఉన్న ఆస్తులన్నీ జప్తు కానున్నాయి. ఇక నుంచి యూఎస్ పౌరులెవరూ.. వీరితో లావాదేవీలు నిర్వహించకూడదు. అగ్రరాజ్యం నిషేధించిన ఉగ్రవాదుల్లో భారత ఉపఖండంలోని అల్ఖైదా(ఏక్యూఐఎస్)కు చెందిన ఒసామా మహమూద్, ఆతిఫ్ యాహ్యా ఘోరీ, మహమ్మద్ మారూఫ్, తెహ్రీక్-ఎ-తాలిబన్ (టీటీపీ)కి చెందిన అమ్జద్ ఉన్నారు. ఏక్యూఐఎస్.. భారత్, పాక్, అఫ్గాన్, మయన్మార్, బంగ్లాదేశ్లలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది, టీటీపీని పాకిస్థాన్ తాలిబన్ అని కూడా అంటారు. ఇది అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్