వైవిధ్యమైన మత విశ్వాసాలకు భారత్ నిలయం: అమెరికా
భారతదేశం గొప్ప వైవిధ్యమైన మత విశ్వాసాలకు నిలయమని.. బైడెన్ ప్రభుత్వం అందరి మత స్వాతంత్య్రాన్ని సమర్థించి ప్రోత్సహిస్తుందని అమెరికా తెలిపింది.
వాషింగ్టన్: భారతదేశం గొప్ప వైవిధ్యమైన మత విశ్వాసాలకు నిలయమని.. బైడెన్ ప్రభుత్వం అందరి మత స్వాతంత్య్రాన్ని సమర్థించి ప్రోత్సహిస్తుందని అమెరికా తెలిపింది. చైనా, పాకిస్థాన్, మయన్మార్తో కలిపి 12 దేశాలతో ఏర్పాటు చేసిన ‘‘ప్రత్యేక ఆందోళనకర దేశాల’’ జాబితాను అమెరికా ఇటీవల రూపొందించింది. వ్యక్తుల నమ్మకాల కారణంగా వేధింపులు, భయపెట్టడం, ప్రాణాలు తీయడం వంటివి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. మానవ హక్కుల విషయంలో భారత్ను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు? అని అడిగిన ప్రశ్నకు అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందిస్తూ.. ‘‘భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మత విశ్వాసాలకు పుట్టినిల్లు’’ అని తెలిపారు. భారత్తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మత స్వాతంత్య్రాన్ని నిశితంగా గమనిస్తున్నామని వివరించింది. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్లో మత స్వాతంత్య్రం కొనసాగించేందుకు రెండు దేశాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట