తిరిగి కోరలు చాస్తున్న మలేరియా
కరోనా వైరస్ విజృంభణ మలేరియా వ్యాధి నియంత్రణకు అడ్డుతగిలింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల కేసులు
జెనీవా: కరోనా వైరస్ విజృంభణ మలేరియా వ్యాధి నియంత్రణకు అడ్డుతగిలింది. ఫలితంగా గత రెండేళ్లలో అదనంగా 63,000 మరణాలు సంభవించాయని, అదనంగా 1.3 కోట్ల మందికి మలేరియా సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గురువారం తెలిపింది. 2020లో బాగా పెరిగిన మలేరియా కేసులు 2021లోనూ వృద్ధి చెందాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా 24.7 కోట్ల మలేరియా కేసులు నమోదై, 6,19,000 మరణాలు సంభవించాయి. వాటిలో 95 శాతం ఒక్క ఆఫ్రికా ఖండంలోనే నమోదయ్యాయి. నిజానికి 2019కన్నా ముందే మలేరియాపై పోరాటం మందగించిందని బ్రిటిష్ నిపుణుడు క్రెయిగ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?