సంక్షిప్త వార్తలు(2)
హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారిపై ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిరసనకారుడికి ఉరి శిక్షను అమలు చేసింది.
హిజాబ్ ఆందోళనలపై ఉక్కుపాదం
నిరసనకారుడికి ఉరి శిక్ష అమలుచేసిన ఇరాన్
టెహ్రాన్: హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్నవారిపై ఇరాన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ నిరసనకారుడికి ఉరి శిక్షను అమలు చేసింది. హిజాబ్ ఆందోళనలకు సంబంధించి అమలైన మొదటి మరణ శిక్ష ఇదే. సెప్టెంబరు 25న దేశ రాజధాని టెహ్రాన్లో ఓ రోడ్డును బ్లాక్ చేయడంతోపాటు పారామిలిటరీ సిబ్బందిలో ఒకరిని గాయపరిచాడంటూ మొహసెన్ షెకారీ అనే వ్యక్తిపై నమోదైన అభియోగాలపై విచారణ చేపట్టిన కోర్టు.. అతణ్ని దోషిగా తేల్చింది. శాంతిభద్రతలను దెబ్బతీయడంతోపాటు దైవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ నవంబరు 1న అతనికి మరణ శిక్షను విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అతను సుప్రీంకోర్టుకు వెళ్లినా.. సుప్రీంకూడా ఆ తీర్పునే సమర్థించింది. ఈ క్రమంలోనే అధికారులు తాజాగా అతనికి ఉరి శిక్షను అమలు చేశారు. మరోవైపు.. హక్కుల కార్యకర్తలు ఈ శిక్షను తీవ్రంగా ఖండించారు. దీన్ని బూటకపు న్యాయ ప్రక్రియగా అభివర్ణించారు. ‘‘మొహసెన్ షెకారీ ఉరిశిక్షపై.. అంతర్జాతీయ సమాజం బలంగా స్పందించాలి. లేనిపక్షంలో.. ఉరిశిక్షలు రోజువారీ వ్యవహారంగా మారతాయి’’ అని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగద్దమ్ ట్వీట్ చేశారు. ‘‘ప్రజా తిరుగుబాటును మరింత అణచివేయడానికి, ప్రజల్లో భయాన్ని కలిగించడానికి ఈ శిక్షలు విధిస్తున్నారు’’ అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు మరో 10 మందికి మరణశిక్ష పడినట్లు తెలుస్తోంది. మహ్సా అమీని మరణంతో దేశంలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అమీని మృతికి కారణమైందని ఆరోపణలు ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ఇరాన్ ఇటీవల రద్దు చేసింది.
జర్మనీలో కుట్ర ఆరోపణలతో 25 మంది అరెస్ట్
11 రాష్ట్రాల్లో 150 చోట్ల దాడులు
బెర్లిన్: జర్మన్ పార్లమెంటు భవనంపై సాయుధ దాడికి పాల్పడే కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటిదాకా 11 రాష్ట్రాల్లోని 150 ప్రాంతాల్లో దాడులు జరిపి, దాదాపు 25 మందిని అరెస్టు చేశారు. మరో 27 మందిని విచారిస్తున్నారు. మూడు వేలమంది అధికారులు ఈ దాడుల్లో నిమగ్నమై ఉన్నట్లు చీఫ్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ పీటర్ ఫ్రాంక్ తెలిపారు. ఇప్పటిదాకా అరెస్టయిన వారిలో రాజవంశానికి చెందిన వ్యక్తిగా ప్రచారంలో ఉన్న హెయిన్రిచ్ రాయిస్ (71), ఓ రిటైర్డ్ పారాట్రూపర్, మాజీ జడ్జి తదితరులు ఉన్నారు. ఈ కుట్ర ఆరోపణలకు సంబంధించిన విశ్వసనీయ ఆధారాలు ఏవీ అధికారులు చూపడం లేదు. జర్మనీలో ప్రభుత్వాన్ని కూల్చి, కొత్త పాలకుణ్ని తీసుకువచ్చేందుకు కుట్రదారులు రష్యన్ అధికారులతో చర్చలు జరిపినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. అటు రష్యా అధికారుల నుంచి దీనిపై ఎటువంటి స్పందన కనిపించడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్