Ukraine conflict: పదవి ఊడగొట్టిన ప్రసంగం..!
నోటి దురద జర్మనీ నేవీ చీఫ్ పదవిని ఊడగొట్టింది. ఐరోపా సమాఖ్య విధానానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పదవికి రాజీనామా చేయించారు. జర్మనీ
రాజీనామా చేసిన జర్మనీ నేవీ చీఫ్
ఇంటర్నెట్డెస్క్: నోటి దురద జర్మనీ నేవీ చీఫ్ పదవిని ఊడగొట్టింది. ఐరోపా సమాఖ్య విధానానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే పదవికి రాజీనామా చేయించారు. జర్మనీ నావికాదళం చీఫ్ కే అచిమ్ షాన్బాక్ నిన్న భారత్లోని న్యూదిల్లీలో ఉన్న మనోహర్ పారేకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘వాస్తవానికి ఉక్రెయిన్లో చిన్న భూభాగాన్నే రష్యా కోరుకుంటోందా..? ఇదంతా ఓ చెత్త.. పుతిన్ కేవలం ఒత్తిడి మాత్రమే పెంచవచ్చు.. తలుచుకుంటే ఐరోపా సమాఖ్య లో అభిప్రాయ భేదాలు సృష్టించగలడన్న విషయం కూడా అతనికి తెలుసు. అతను నిజంగా గౌరవం కోరుకుంటున్నాడు. నన్నడిగితే అతన్ని గౌరవించడం తేలిక.. అతను గౌరవానికి అర్హుడు. రష్యా పురాతనమైన, ముఖ్యమైన దేశం’’ అని వ్యాఖ్యానించాడు.
జర్మనీ నావికాదళం చీఫ్ కే అచిమ్ అక్కడితో ఆగలేదు.. ‘‘భారత్, జర్మనీలకు రష్యా అవసరం ఉంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఈ పెద్దదేశం చాలా అవసరం. అది ప్రజాస్వామ్యం కాకపోయినా సరే.. ద్వైపాక్షిక భాగస్వామిగా అవసరం. వారికి ఒక అవకాశం ఇద్దాం. చైనా నుంచి రష్యాను దూరంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చైనాకు రష్యా వనరులు కావాలి’’ అని పేర్కొన్నాడు. దీంతోపాటు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు అవసరమైన ప్రమాణాలను అందుకోలేదని వ్యాఖ్యానించారు.
ఐరోపా సమాఖ్యలో కీలక భాగస్వామి అయిన జర్మనీ విధానాలకు అచిమ్ వ్యాఖ్యలు పూర్తిగా వ్యతిరేకం. వాస్తవానికి రష్యాతో జర్మనీ సైనిక ఘర్షణ కోరుకోవడం లేదు. కానీ, ఐరోపా సమాఖ్యను కాదని రష్యాకు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కే అచిమ్ వ్యాఖ్యలు ఐరోపా మిత్రుల్లో అనుమానాలు పెంచాయి. దీంతో వెంటనే జర్మనీ నష్ట నివారణ చర్యలకు దిగింది. వైస్ అడ్మిరల్ కే అచిమ్ చేత నావికాదళ చీఫ్ పదవికి రాజీనామా చేయించింది. ఈ విషయాన్ని జర్మనీ రక్షణశాఖ ప్రతినిధి ధ్రువీకరించారు. వైస్ అడ్మిరల్ తక్షణం తన పదవిని వీడారు అని పేర్కొన్నారు. అతని వ్యాఖ్యలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ అంశంపై అమెరికా, రష్యాల మధ్య పరిస్థితి ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఈ రెండు దేశాల మధ్య భద్రతాపరంగా చెలరేగిన అతిపెద్ద సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించిన రష్యా తదుపరి వ్యూహం పశ్చిమ దేశాలకు అంతుచిక్కడం లేదు. మరోవైపు ఈ ప్రాంతంలో మరిన్ని సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని ప్రకటించిన రష్యా.. వేడిని రాజేసింది. కరీబియన్ ప్రాంతంలో సైనిక మోహరింపులనూ కొట్టిపారేయలేమని పేర్కొంది. అమెరికా, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే నేతలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చలు జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
భారత్కు రష్యా అందజేయాల్సిన మిగతా రెండు ‘ఎస్-400’ అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదే చేరుకుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. -
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
అక్రమ వలసలతో సతమతమవుతోన్న బ్రిటన్.. వీటికి అడ్డుకట్ట వేసే ‘రువాండా బిల్లు’కు (Safety of Rwanda Bill) ఆమోదం తెలిపింది. -
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
ఈజీజెట్ విమానంలో ఓ ప్రయాణికుడు తాగిన మత్తులో ఎయిర్లైన్ సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM