Covaxin: జర్మనీ వెళ్లేవారికి ఊరట.. కొవాగ్జిన్ తీసుకున్న వారికి అనుమతి
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాక్సిన్కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
జూన్ 1 నుంచి అమలులోకి వస్తుందన్న జర్మనీ రాయబారి
దిల్లీ: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్కు జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని భారత్లోని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ వెల్లడించారు. దీంతో కొవాగ్జిన్ టీకా తీసుకొని జర్మనీ వెళ్లాలనుకునే ప్రయాణికులకు మార్గం సుగమమయ్యింది. జూన్ 1 నుంచి ఇది అమలులోకి రానుంది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన కొవాగ్జిన్ టీకాను తీసుకున్న ప్రయాణికులను అనుమతించాలని జర్మనీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నుంచి ఇది మొదలు కానుంది. ఇందుకోసం మా రాయబార కార్యాలయం తీవ్ర కృషి చేసింది. ఎందుకంటే కరోనా వల్ల వీసా సెలక్షన్ దరఖాస్తులు పేరుకుపోవడంతో ఇందుకు సుదీర్ఘ సమయం పడుతోంది. దయచేసి ఓపిక పట్టండి’ అని భారత్లోని జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నెర్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, కరోనా వైరస్ను ఎదుర్కొనే కొవాగ్జిన్ టీకా ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL)కు గతేడాది నవంబర్లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. దీంతో ఆస్ట్రేలియా, జపాన్, కెనడా వంటి దేశాలు కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రయాణికులను అమతిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా జర్మనీ కూడా కొవాగ్జిన్ తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.