Corona: జర్మనీపై కరోనా పడగ.. ఒక్కరోజే 96వేలకు పైగా కేసులు!
ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా(Corona virus) మహమ్మారి యూరప్ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది......
బెర్లిన్: ప్రపంచాన్ని గజగజ వణికించిన కరోనా(Corona virus) మహమ్మారి యూరప్ దేశాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తుండటంతో ఏం చేయాలో తోచక సతమతమవుతోన్న జర్మనీపై ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 24గంటల్లోనే ఆ దేశంలో 96వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఆర్థిక మాంద్యం కమ్ముకొస్తుండటంతో సతమతమవుతున్న వేళ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి కార్ల్ లాటర్బాచ్ హెచ్చరించారు. కొత్త వేరియంట్ల నుంచి కాపాడుకొనేందుకు వృద్ధులు రెండో బూస్టర్ డోసు వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
యూరప్లోని ఇతర దేశాలైన ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్లలోనూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఈ మేరకు బెర్లిన్లో విలేకర్లతో మాట్లాడిన ఆయన శీతాకాలం ఆరంభంలో ఉన్నామని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జర్మనీలో గడిచిన 24గంటల వ్యవధిలోనే 96,367 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది వారం క్రితం నమోదైన కొవిడ్ కేసులతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు అధికం కావడం గమనార్హం. శనివారం నుంచి జర్మనీలో 16 రాష్ట్రాలు మళ్లీ ఇంట్లోనూ మాస్క్లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనల్ని విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా