Germany recession: ఆర్థిక మాంద్యంలోకి జర్మనీ
తీవ్ర ద్రవ్యోల్బణాన్ని (Inflation) చవిచూస్తున్న జర్మనీ.. ఆర్థిక మాంద్యంలోకి జారుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని పేర్కొంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశాలపై ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రభావం చూపుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో (Largest Economy) నాలుగో స్థానంలో ఉన్న జర్మనీపైనా (Germany) దీని ప్రభావం పడింది. కొంతకాలంగా అక్కడ కొనసాగుతోన్న అధిక ద్రవ్యోల్బణం (Inflation), ఇంధన సంక్షోభం వంటి పరిస్థితులతో జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి (Recession) జారిపోతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తాజా నివేదికను జర్మనీ గణాంక విభాగం గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (GDP) 0.3శాతం పడిపోయినట్లు వెల్లడించింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5శాతం క్షీణత కనిపించింది. ఈఏడాది వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని అంచనా వేసిన తరుణంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. ఇలా వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా (Recession) నిర్వచిస్తారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం, పారిశ్రామిక ప్రగతి మందగించడం, కఠినమైన ద్రవ్యపరపతి విధానంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకులు వంటివి బలహీన ఆర్థిక వ్యవస్థకు కారణంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
తాజా గణాంకాల ప్రకారం, గత రెండు త్రైమాసికాల్లో జర్మనీ వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం 1.2 శాతం తగ్గిపోయింది. ప్రభుత్వం చేసే ఖర్చుల్లోనూ 4.9 శాతం తగ్గుదల కనిపించింది. గతేడాది చివర్లో ఆశించినమేర పెట్టుబడులు రానప్పటికీ ఈ ఏడాది త్రైమాసికంలో కొంత మెరుగుపడ్డాయి. అంతకుముందుతో పోలిస్తే మెషినరీ, ఎక్విప్మెంట్లలో పెట్టుబడులు 3.2శాతం పెరగగా.. నిర్మాణరంగంలోనూ 3.9శాతం పెట్టుబడులు పెరిగాయి. దిగుమతుల్లో 0.9శాతం క్షీణత కనిపించగా.. వాణిజ్యం, ఎగుమతుల్లో 0.4శాతం వృద్ధి దోహదం చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే, మాంద్యం నుంచి తప్పించుకునే అవకాశం లేనప్పటికీ ఈ ఏడాది మొదట్లో కాస్త పురోగతి కనిపించడం ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి సంకేతం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ఆర్థికమాంద్యం నిర్వచనంపై భిన్న వాదనలు ఉన్నప్పటికీ.. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని మాంద్యంగా పరిగణిస్తున్నారు. ఈ మాంద్యం కొనసాగే సమయంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగ రేటు చాలా వేగంగా పెరుగుతాయి. ప్రజల ఆదాయం తగ్గడంతో కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా చూపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు