Earthquake: శిథిలాల కింద తమ్ముడికి ఏం కాకూడదని.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఏడేళ్ల బాలిక ఫొటో
ఎంత అల్లరిచేసినా, కొట్టుకున్నా తోబుట్టువుల ప్రేమ, బంధం చాలా గొప్పదని చెప్పే చిత్రమిది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ చిన్నారి తన తమ్ముడికి ఏం కాకూడదని 17గంటల పాటు తలపై చేయి పెట్టి కాపాడింది. సిరియా భూప్రళయ భయానక పరిస్థితుల మధ్య కన్పించిందీ హృదయాన్ని హత్తుకునే దృశ్యం.
ఇంటర్నెట్ డెస్క్: భూకంపం (Earthquake) ధాటికి భవనం కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారో అక్కాతమ్ముడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన బుజ్జి తమ్ముడికి ఏం కాకుండా చూసిందా ఏడేళ్ల బాలిక. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా తమ్ముడికి దెబ్బలు తగలకుండా అతడి తలపై చెయ్యి అడ్డుపెట్టింది. హృదయాల్ని మెలిపెట్టిన ఈ దృశ్యం.. ప్రకృతి విపత్తు కారణంగా అల్లకల్లోలంగా మారిన సిరియా (Syria)లో కన్పించింది.
గత సోమవారం తుర్కియేలో చోటుచేసుకున్న భారీ భూకంపం (Earthquake) ధాటికి పొరుగున్న సిరియాలోనూ అనేక ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలి శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది రెండురోజులుగా శ్రమిస్తున్నారు. ఆ సమయంలోనే ఈ దృశ్యం కన్పించింది. ఓ భూకంప ప్రభావిత ప్రాంతంలో శిథిలాలను తొలగిస్తుండగా.. వాటి కింద ఈ అక్కాతమ్ముడు సజీవంగా కన్పించారు. వెంటనే సహాయక సిబ్బంది వారిని బయటకు తీసుకురావడంతో 17 గంటల తర్వాత వారు మృత్యుంజయులుగా విపత్తు నుంచి బయటపడ్డారు.
ఇందుకు సంబంధించిన ఫొటోను ఐక్యరాజ్యసమితి (United Nations) ప్రతినిధి మహమ్మద్ సఫా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘శిథిలాల కింద 17 గంటల పాటు తమ్ముడి తలకు చేయి అడ్డుగా పెట్టి కాపాడిన 7 ఏళ్ల బాలిక సురక్షితంగా బయటపడింది. ఈ ఫొటోను ఎవరూ షేర్ చేయట్లేదు. ఒకవేళ మరణించి ఉంటే వైరల్ అయి ఉండేది. దయచేసి సానుకూల సందేశాలను కూడా షేర్ చేయండి’’ అని రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ (Viral Photo)గా మారింది. ‘‘అద్భుతం జరిగింది. ఆమె చాలా గొప్ప అక్క. ధైర్యవంతురాలు’’ అంటూ పలువురు నెటిజన్లను కొనియాడుతున్నారు. పిల్లల ప్రేమ, బంధానికి నిజమైన నిదర్శమంటూ పోస్టులు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!