Mexico: దుండగుల కాల్పులు.. మేయర్ సహా 20 మంది మృతి!
మెక్సికో (Mexico) మరోసారి కాల్పులతో అట్టుడికింది! ఇక్కడి శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు.
మెక్సికో సిటీ: మెక్సికో (Mexico) మరోసారి కాల్పులతో అట్టుడికింది! ఇక్కడి శాన్ మిగ్యుల్ టోటోలాపాన్ పట్టణంలోని సిటీ హాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 20 మంది మృతి చెందారు. హత్యకు గురైన వారిలో పట్టణ మేయర్ (Mayor) కాన్రాడో మెండోజా(Conrado Mendoza), ఆయన తండ్రి, మాజీ మేయర్ జువాన్ మెండోజా కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం మేయర్ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలతో సిటీ హాల్ రక్తసిక్తంగా మారింది. తూటాలతో గోడలకు రంధ్రాలు ఏర్పడటం గమనార్హం.
ఈ ఘటనకు బాధ్యత తమదేనంటూ ‘టెకిలెరోస్’ ముఠా ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకువచ్చింది. స్థానికంగా డ్రగ్స్ వ్యాపారం, కిడ్నాప్లు, దోపిడీలు, అనేక హత్యల్లో ఈ గ్యాంగ్ పాత్ర ఉంది. అయితే, అధికారులు ఈ వీడియోను ధ్రువీకరించాల్సి ఉందన్నారు. క్రిమినల్ ముఠాల మధ్య వివాదం నేపథ్యంలోనే ఈ హత్యాకాండ జరిగినట్లు మెక్సికో ప్రజాభద్రతా అధికారి రికార్డో మెజియా చెప్పారు. మేయర్ను హతమార్చాలనే లక్ష్యంతోనే వారు భవనం లోపల ప్లాన్ ప్రకారం దాడులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. భద్రతా బలగాలు పట్టణంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకుగానూ అంతకుముందే భారీ వాహనాలతో రహదారులను బ్లాక్ చేసినట్లు తెలిపారు.
మేయర్ హత్యపై గెరెరో గవర్నర్ ఎవెలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఆర్డీ పార్టీ సైతం ఈ ఘటనను ఖండించింది. పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మరోవైపు.. నిందితులను పట్టుకునేందుకు మెక్సికో ప్రభుత్వం సైన్యాన్ని దించింది. ఇదిలా ఉండగా.. బుధవారం క్యూర్నావాకా నగరంలోనూ చట్టసభ్యురాలు గాబ్రియేలా మారిన్ను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఎటెల్లెక్ట్ కన్సల్టోర్స్ వివరాల ప్రకారం.. మెండోజా హత్యతో.. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ పాలనలో మరణించిన మేయర్ల సంఖ్య 18కి చేరగా.. చట్టసభ సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరినట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శుక్రవారం చైనా సైన్యంలో.. ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ (ఐఎస్ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. -
ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!
పశ్చిమాసియా మళ్లీ వేడెక్కింది. ప్రతీకారం తప్పదని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు జారీచేస్తున్న ఇజ్రాయెల్.. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్పై దాడి చేసింది. -
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదుల దాడి
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదుల ముఠా మరోసారి రెచ్చిపోయింది. గురువారం రాత్రి బస్సుపై దాడి చేసి 22 మందిని హతమార్చింది. -
పాలస్తీనాకు వ్యతిరేకంగా అమెరికా ఓటు
ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని కల్పించాలంటూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన ఓ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటేసింది. -
కూలిన రష్యా సూపర్ సోనిక్ బాంబర్ విమానం
రష్యా అమ్ములపొదిలో వ్యూహాత్మక సూపర్ సోనిక్ బాంబర్ విమానం టీయూ-22ఎం3ని కూల్చివేసినట్లు ఉక్రెయిన్ శుక్రవారం ప్రకటించింది. -
ట్రంప్ విచారణ జరిగే కోర్టు వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం!
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్న న్యూయార్క్లోని మాన్హటన్ కోర్టు వెలుపల ఒక వ్యక్తి అగ్నికీలల్లో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. -
కలరా టీకాలో కొత్త వెర్షన్కు డబ్ల్యూహెచ్వో ఆమోదం
విస్తృతంగా వినియోగంలో ఉన్న కలరా టీకాకు సంబంధించిన ఒక కొత్త వెర్షన్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం తెలిపింది. -
పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద వ్యక్తి అరెస్టు
ఆయుధాలతో సంచరిస్తున్నాడన్న అనుమానంతో పారిస్లోని ఇరాన్ దౌత్య కార్యాలయం వద్ద ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. -
జపాన్ పౌరుల వాహనమే లక్ష్యంగా పాక్లో ఆత్మాహుతి దాడి యత్నం
పాకిస్థాన్లో జపాన్ దేశీయులు ప్రయాణిస్తున్న వాహనమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి యత్నం జరిగింది. -
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
ఇరాన్పై డ్రోన్ దాడి విషయంలో ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి క్షణంలో సమాచారం అందిందని అమెరికా చెప్పినట్లు ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు.