Australia: ఇన్సూరెన్స్ కంపెనీపై సైబర్ దాడి.. హ్యాకర్ చేతిలో కోటి మంది సమాచారం..!
ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మెడిబ్యాంక్పై హ్యాకర్లు దాడికి పాల్పడ్డారు. వారు డిమాండ్ చేసిన డబ్బులు చెల్లించకపోవడంతో తస్కరించిన సమాచారాన్ని డార్క్వెబ్లో ఉంచారు. సుమారు కోటి మంది సమాచారం హ్యాకర్లు చేతిలో ఉన్నట్లు భావిస్తున్నారు.
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోనే (Australia) అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై హ్యాకర్లు (Hacking) దాడిచేసి వినియోగదారుల సమాచారాన్ని తస్కరించారు. ఆ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండాలంటే తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు సదరు కంపెనీ నిరాకరించడంతో వాటిలోని కొంత సమాచారాన్ని డార్క్వెబ్లో బహిర్గతం చేశారు. వీటిని బీమా సంస్థ ధ్రువీకరించింది. ఆ కంపెనీకి చెందిన కోటి మంది ప్రస్తుత, పూర్వ వినియోగదారుల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతుల్లో చిక్కుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన మెడిబ్యాంక్ (Medibank) హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై గతనెల హ్యాకర్ల దాడి జరిగింది. ఆ సమయంలోనే పూర్తి సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించినట్లు సంస్థ భావిస్తోంది. అయితే, ఆ వివరాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో నగదు డిమాండ్ చేశారు. వాటిని ఇన్సూరెన్స్ సంస్థ చెల్లించలేదు. దీంతో వందమందికిపైగా సమాచారాన్ని ‘నాటీ లిస్ట్’ పేరుతో డార్క్నెట్లో విడుదల చేసిన ఓ హ్యాకర్.. ఇది శాంపిల్ మాత్రమేనని పేర్కొన్నాడు. అందులో హెచ్ఐవీ నిర్ధారణ అయినవారితోపాటు మద్యం, డ్రగ్స్కు బానిసలైన వారు, మానసిక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతోన్న వారి వివరాలు ఉన్నాయి. దీంతో మరింత మంది వినియోగదారుల సమాచారాన్ని బహిర్గతం చేసే ప్రమాదం ఉందని ఆ సంస్థ అనుమానిస్తోంది.
తమ ఇన్సూరెన్స్ (Insurance) కంపెనీకి చెందిన సున్నితమైన వివరాలు బహిర్గతం కావడంపై మెడిబ్యాంక్ సీఈఓ డేవిడ్ కాక్జ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యతగా కస్టమర్లకు క్షమాపణలు చెప్పిన ఆయన.. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మరోవైపు, ఈ వివరాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి కాకుండా సదరు సంస్థలు చర్యలు చేపట్టాలని ఆస్ట్రేలియా సైబర్సెక్యూరిటీ (Cyber Security) మంత్రి క్లేర్ ఓ నీల్ స్పష్టం చేశారు. ఈయన కూడా మెడిబ్యాంక్ కస్టమర్ కావడం, హ్యాకింగ్కు గురైన జాబితాలో ఆయన ఆరోగ్య సమాచారం కూడా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
డీప్ఫేక్ (Deep Fake) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టగలదు.. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచగలదని ఫిలిప్పీన్స్లో విడుదలైన ఒక వీడియో చూస్తే అనిపించకమానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
USA: ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. -
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో
ఇండొనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం లాంఛనంగా ప్రకటించింది. -
కట్టు తప్పిన సైనిక గుర్రాలు.. లండన్ వీధుల్లో పరుగోపరుగు
రద్దీగా ఉన్న రోడ్లపై రౌతులు లేకుండా అడ్డదిడ్డంగా పరుగులు తీస్తున్న అయిదు మిలటరీ గుర్రాలను చూసి బుధవారం లండన్ వాసులు విస్తుపోయారు. -
మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్కు ఆయుధాలు
ఉక్రెయిన్, ఇజ్రాయెల్, తైవాన్తో పాటు.. ఇండో పసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు రూ.8 లక్షల కోట్ల ప్యాకేజీ (95.3 బిలియన్ డాలర్లు) బిల్లుకు మంగళవారం రాత్రి అమెరికా సెనెట్ 79-18తో ఆమోదముద్ర తెలిపింది. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు: బైడెన్
ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారని ఆరోపించారు. -
కశ్మీర్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
కశ్మీర్ సమస్యను ఆ ప్రాంత ప్రజల అభీష్టానికి అనుగుణంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పాకిస్థాన్, ఇరాన్లు బుధవారం విడుదల చేసిన ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. -
రోదసిలోకి మరో ముగ్గురు చైనా వ్యోమగాములు!
చందమామపైకి 2030 నాటికి మానవులను పంపాలన్న లక్ష్యం దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భూదిగువ కక్ష్యలోని తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపనుంది. -
మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. -
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
హృదయ సంబంధ వ్యాధితో బాధ పడుతున్న పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండెను ఉచితంగా అమర్చి మానవత్వాన్ని చాటుకున్నారు చైన్నైలోని ఓ ఆస్పత్రి వైద్యులు. -
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
ఎల్లప్పుడూ రద్దీగా ఉండే లండన్ వీధుల్లో రెండు ఆర్మీ గుర్రాలు పరుగులు పెడుతూ బుధవారం హల్చల్ చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్