Twitter: ట్విటర్పై హ్యాకర్ల పంజా.. అమ్మకానికి 23.5కోట్ల మంది ఈమెయిల్ ఐడీలు..!
23.5 కోట్ల మంది ట్విటర్ యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగలించి ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం కలకలం రేపుతోంది. ఈ డేటా లీక్తో భారీ ఎత్తున సైబర్ నేరాలు జరిగే ముప్పు పొంచి ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) నుంచి పెద్ద ఎత్తున యూజర్ల డేటా లీక్ అవ్వడం కలకలం సృష్టిస్తోంది. సుమారు 23.5కోట్ల మంది ట్విటర్ యూజర్ల వ్యక్తిగత డేటా (Personal Data)ను హ్యాకర్లు అపహరించినట్లు ఇజ్రాయెల్కు చెందిన సైబర్ ఇంటెలిజెన్స్ కంపెనీ హడ్సన్ రాక్ తెలిపింది. ఈ డేటాను ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరమ్లో విక్రయానికి ఉంచినట్లు వెల్లడించింది.
‘‘23.5 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత రికార్డులు, ఈమెయిల్ ఐడీలకు సంబంధించిన డేటా లీక్ (Data Breach) అయ్యింది. దీంతో ఆ ఖాతాలపై భారీ ఎత్తున హ్యాకింగ్, ఫిషింగ్ (Phishing), డాక్సింగ్ (Doxxing) జరిగే ప్రమాదముంది’’ అని హడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు అలన్ గాల్ లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. సుమారు రెండు వారాల క్రితమే ఈ హ్యాకింగ్ను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ట్విటర్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ట్విటర్ ఎలాంటి చర్యలు చేపట్టిందన్నదానిపై కూడా స్పష్టత లేదు.
ఈ లీక్ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు. అయితే 2021 చివర్లోనే ఈ హ్యాకింగ్ జరిగినట్లు సైబర్ నిపుణులు భావిస్తున్నారు. ట్విటర్ ఏపీఐలో లోపం ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్ అపహరించాడని హడ్సన్ రాక్ తెలిపింది. లీకైన డేటాలో యూజర్ల ఇ-మెయిల్, పేరు, యూజర్ నేమ్, ఫాలోవర్లు వివరాలున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్టులు, ప్రముఖుల ఖాతాల వివరాలు కూడా హ్యాకర్ల (Hackers) చేతికి వెళ్లినట్లు సమాచారం.
ట్విటర్ (Twitter)లో పెద్ద ఎత్తున డేటా లీక్ అయినట్లు ఇటీవల వార్తలు రాగా.. 40 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి ఉంటారని కథనాలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆ సంఖ్యను 23.5 కోట్లుగా పేర్కొంటూ హడ్సన్ రాక్ తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. కాగా.. ఈ డేటా లీక్పై యూఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఐర్లాండ్లోని డేటా ప్రొటెక్షన్ కమిషన్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా