Omicron: మరికొన్ని వారాల్లో సగం ఐరోపాకు కరోనా..!
ఐరోపా ఖండంపై ఒమిక్రాన్ పడగవిప్పింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు
ఇంటర్నెట్డెస్క్: ఐరోపా ఖండంపై ఒమిక్రాన్ పడగ విప్పింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లోపు సగం ఐరోపాకు కరోనా సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పశ్చమ ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం వరకు మొత్తం ఒమిక్రాన్ వ్యాపిస్తుందన్నారు. 2022 తొలి వారంలో 70 లక్షల మందికి కొవిడ్ సోకడాన్ని ఆధారంగా చేసుకొని ఈ అంచనాలను లెక్కగట్టారు. ఐరోపా ఖండంలో ఇన్ఫెక్షన్ సోకిన వారి సంఖ్య రెండు వారాల్లో రెట్టింపైందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రీజనల్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కనీసం 50శాతం మంది ప్రజలు అత్యధికంగా ఎనిమిది వారాల్లోపు ఒమిక్రాన్ బారిన పడే అవకాశం ఉందని అమెరికాలోని సియాటెల్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ అంచనా వేసినట్లు వెల్లడించారు.
ఐరోపా, మధ్య ఆసియా దేశాలపై ఒమిక్రాన్ ఒత్తిడి కొనసాగుతోందని డాక్టర్ హాన్స్ క్లూగ్ పేర్కొన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ముప్పు తక్కువే ఉన్నా.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. సోమవారం ఒక్కరోజే యూకేలో 1,42,224 మందికి కొవిడ్ సోకగా.. వీరిలో 77 మంది మృతి చెందారు. మరోపక్క పలు ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతున్నట్లు బ్రిటన్ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక మరణాల రేటు నమోదవుతున్న దేశాల్లో ఐరోపాలోని పోలాండ్ ఆరో స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ కనీసం 40శాతం మందికి ఎటువంటి వ్యాక్సిన్లు అందలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?