Harnaaz Sandhu: కన్నీరు పెట్టుకుని స్టేజ్పై జారి పడబోయిన హర్నాజ్ సంధు
మాజీ విశ్వసుందరి, భారతీయ భామ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) భావోద్వేగానికి గురయ్యారు. విశ్వ సుందరి పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె స్టేజ్పై కన్నీరు పెట్టుకున్నారు. ర్యాంప్వాక్ చేస్తూ జారిపడబోయారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ అందాల పోటీల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే విశ్వ సుందరి పోటీలు అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్ వేదికగా జరిగాయి. దాదాపు 80 దేశాలకు చెందిన భామలు తలపడిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారతీయ భామ ‘మిస్ యూనివర్స్ 2021’ హర్నాజ్ సంధు (Harnaaz Sandhu) పాల్గొని సందడి చేశారు. అందాల భామల మధ్య జరిగిన పలు పోటీలను ఆమె దగ్గరుండి వీక్షించారు. ఈ ఏడాది విశ్వ సుందరిని ప్రకటించేటప్పుడు స్టేజ్పైకి వచ్చిన ఆమె.. మిస్ యూనివర్స్ హోదాలో చివరిసారిగా ర్యాంప్పై వాక్ చేశారు. ఆ ఉద్విగ్న క్షణాల్లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. దాంతో స్టేజ్పైనే ఆమె జారి పడిపోబోయారు. వెంటనే తమాయించుకున్న ఆమె తిరిగి వాక్ కొనసాగించారు. అనంతరం మిస్ యూనివర్స్ 2022గా గెలుపొందిన అమెరికా భామ ఆర్ బానీ గాబ్రియేల్కు కిరీటాన్ని అలంకరించారు ఈ భామ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.