Covid-19: దీర్ఘకాలిక కొవిడ్.. క్యాన్సర్ కంటే ప్రమాదం..: తాజా అధ్యయనంలో వెల్లడి
దీర్ఘకాలిక కొవిడ్తో బాధపడుతున్న వారిలో శ్వాససంబంధిత సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం కంటే దీర్ఘకాల కొవిడ్ బాధితుడి ఆరోగ్యం ఇబ్బందికరంగా తయారవుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: దీర్ఘకాల కొవిడ్ (Covid) బాధితుల్లో వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ వైరస్ సోకిన తర్వాత ఎక్కువ కాలం కోలుకోని వారి ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అధ్యయనం (Study) పేర్కొంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్న బాధితుడి అనారోగ్యం కంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోందని తేల్చింది. ఈ మేరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్ (ఎన్ఐహెచ్ఆర్) జర్నల్లో కథనం ప్రచురితమైంది. అధ్యయనంలో భాగంగా దీర్ఘకాలం కొవిడ్తో బాధపడిన 3,750 మంది రోగులపై పరిశోధనలు చేశారు. లండన్ యూనివర్సిటీకి చెందిన యూసీఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియోలజీ అండ్ హెల్త్ విభాగంలోని వైద్యుల బృందం ఈ పరిశోధన చేపట్టింది.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రోగుల ఆరోగ్యంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకున్నాయన్న దానిపై ఈ వైద్యుల బృందం పరిశోధించింది. దీని కోసం ఓ డిజిటల్ యాప్ను రూపొందించి తమకు సమాధానాలు కావాల్సిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు. అలసట (fatigue), నిరాశ, ఆందోళన, మెదడు చురుకుదనం తదితర అంశాలపై ప్రశ్నలకు దీర్ఘకాలిక కొవిడ్ బాధితుల నుంచి సమాధానాలు రాబట్టారు. వీరిలో ఎక్కువ మంది అలసటతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇది ఎంతలా ఉందంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్థాయిలో ఉన్నప్పుడు ఓ బాధితుడు ఎంతలా అలసటకు గురవుతాడో అంతకంటే.. ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
‘‘బాధితుల జీవితాలపై దీర్ఘకాలిక కొవిడ్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మా అధ్యయనంలో వెల్లడైంది. దీని ప్రభావం వల్ల రోజువారీ కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.’’ అని అధ్యయనానికి నాయకత్వం వహించిన డా. హెన్రీ గుడ్ఫెలో వెల్లడించారు. ఈ యాప్లో వివరాలు నమోదు చేసిన వారిలో 90 శాతం మంది 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే. కొవిడ్ సోకిన తర్వాత మునుపటిలా పని చేయలేకపోతున్నామని అందులోని దాదాపు 51శాతం మంది పేర్కొన్నారు. 20 శాతం మంది పూర్తిగా పని చేయలేకపోతున్నామని చెప్పారు. మరోవైపు తమ వివరాలు పేర్కొన్న కొవిడ్ బాధితుల్లో 71శాతం మంది మహిళలే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
తగినంత నిద్ర, వ్యాయామం, తినడం వంటివి తగ్గించి పిల్లలు అధిక సమయం ఆన్లైన్లో ఉంటే పాఠశాలలకు గైర్హాజరయ్యే ముప్పు పెరుగు తుందని ఫిన్లాండ్లో నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. -
జపాన్ బుల్లెట్ రైల్లో చొరబడ్డ పాము
జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. -
జైలు నుంచి గృహ నిర్బంధానికి ఆంగ్ సాన్ సూకీ
మయన్మార్ కీలక నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీని ఆ దేశ సైనిక ప్రభుత్వం జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చింది. -
సోషల్ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు
సామాజిక మాధ్యమాల్లో పేరు కోసం కొంతమంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. -
ఇజ్రాయెల్ దాడి చేయడం ఖాయం
ఇరాన్పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. -
భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. -
రష్యా క్షిపణి దాడిలో 17 మంది మృతి
ఉక్రెయిన్లో పౌర నివాసాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం చెర్నివ్ నగరంపై మాస్కో క్షిపణులు ప్రయోగించింది. -
మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు
మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
న్యూయార్క్లో కాల్పుల కలకలం: ఒకరి మృతి
అమెరికాలోని న్యూయార్క్ నగరం బ్రాంక్స్ కౌంటీలో మంగళవారం సాయంత్రం 6 గంటలకు దుండగుల కాల్పులు కలకలం రేపాయి. -
భారత్-పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోం: అమెరికా
ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఉన్నా అంతం చేసేందుకు భారత్ వెనకాడదని ఇటీవల ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. -
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది.