Heart Transplant: తన ‘పాత గుండె’ను తానే చూసుకుని.. ఉప్పొంగిపోయి!
16 ఏళ్ల క్రితం గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మహిళ.. ఇటీవల తన పాత గుండెను చూసుకుని పొంగిపోయారు. దీన్ని లండన్లోని హంటేరియన్ మ్యూజియంలో భద్రపరిచారు.
లండన్: ఇది 2007 నాటి మాట. అప్పటికి 22 ఏళ్ల వయసున్న ఓ యువతికి గుండె మార్పిడి (Heart Transplantation) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. కాల చక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడామెకు 38 ఏళ్లు. ఈ క్రమంలోనే.. ఒకప్పుడు తన శరీరంలోనే ఉండి లబ్ డబ్మంటూ కొట్టుకున్న ఆ హృదయం (Heart) ఒక్కసారిగా ఆమె కళ్లముందు ప్రత్యక్షమైంది. మ్యూజియంలో భద్రపరిచిన తన సొంత గుండెను చూసుకున్న ఆమె ఉద్విగ్నానికి గురైంది. ఇదంతా నమ్మశక్యం కాని అద్భుతంగా వర్ణించింది. బ్రిటన్ రాజధాని లండన్ (London)లోని హంటేరియన్ మ్యూజియం (Hunterian Museum) ఈ ఘటనకు వేదికగా నిలిచింది.
ఇక్కడి హాంప్షైర్లోని రింగ్వుడ్కు చెందిన జెనిఫర్ సటన్.. యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్న సమయంలో హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. గుండె మార్పిడి చేయని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అప్పటికి ఆమె వయసు 22 ఏళ్లు. శరీరానికి సరిపోయే గుండె కోసం అన్వేషణ సాగిస్తుండగానే.. ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఎట్టకేలకు 2007 జూన్లో ఓ దాత దొరికారు. అయితే, ఆమెకు 13 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి సైతం ఇలాంటి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందారు. దీంతో ఆమె తొలుత ఆందోళన చెందింది. చివరకు, ఆమె హృదయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది.
ఆపరేషన్ అనంతరం కళ్లు తెరిచాకా నన్ను నేనే కొత్త మనిషిగా భావించానని అప్పటి జ్ఞాపకాలను ఆమె గుర్తుచేసుకున్నారు. శస్త్రచికిత్స ద్వారా తొలగించిన తన హృదయాన్ని ప్రదర్శనలో ఉంచేందుకుగానూ ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’కు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే అవయవాల నమూనాలను ప్రదర్శించే ‘హంటేరియన్ మ్యూజియం’లో దాన్ని భద్రపరిచారు. ఇప్పుడు దాన్ని పౌరులందరి సందర్శన కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆమె తన సొంత హృదయాన్ని చూసుకుని పొంగిపోయారు. ఇది తన స్నేహితురాలని, 22 ఏళ్లపాటు తనను బతికి ఉంచిందని.. పాత హృదయాన్ని చూపిస్తూ గర్వంగా చెప్పారు.
అవయవదానాన్ని ఇతరులకు ఇచ్చే గొప్ప బహుమతిగా అభివర్ణించిన ఆమె.. దీన్ని ప్రోత్సహించేందుకుగానూ తాను వీలైనంత మేర కృషి చేస్తానని చెప్పారు. ఒకవేళ అవయవ దాతే లేకపోతే తన జీవితంలో అద్భుతమైన 16ఏళ్లు కోల్పేయేదాన్నని తెలిపారు. పెళ్లి తదితర గొప్ప క్షణాలు ఎప్పటికీ జరిగేవి కావని గుర్తుచేశారు. తన హృదయాన్ని వీలైనంత మేర ఆరోగ్యంగా ఉంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. శస్త్రచికిత్స పూర్తయిన ఏడాదికి ఆమె కొత్త గుండె మనుగడ 93 శాతంగా తేలిందని, ఆమె కోలుకోవడం అద్భుతమని అప్పట్లో శస్త్రచికిత్స నిర్వహించిన సర్జన్ స్టీఫెన్ లార్జ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తావించారు. -
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
సైనిక చర్య మొదలైన తర్వాత మొట్టమొదటిసారి రష్యాకు చెందిన ఓ వ్యూహాత్మక బాంబర్ను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. -
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్