IN PICS: మహా విషాదంలో మౌన రోదనలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న చిత్రాలు..
తుర్కియే (Turkey), సిరియా (Syria)లో ప్రకృతి సృష్టించిన విలయం మాటలకందని మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ పెను విపత్తుకు సంబంధించిన చిత్రాలు హృదయాలను మెలిపెడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కన్న కూతుర్ని కోల్పోయిన ఓ తండ్రి.. భుజానెత్తుకుని పెంచిన తండ్రిని పోగొట్టుకున్న కొడుకు.. బొడ్డుతాడు ఊడకముందే అనాథగా మారిన పసికందు.. ప్రకృతి సృష్టించిన భూప్రళయంతో అల్లకల్లోలంగా మారిన తుర్కియే (Turkey), సిరియా (Syria)లో హృదయాల్ని మెలిపెడుతున్న ఇలాంటి విదారక దృశ్యాలెన్నో..! ఈ దయనీయ పరిస్థితులను చూసి సహాయక బృందాలు.. ఫొటో జర్నలిస్టులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘోర విపత్తుకు సంబంధించిన చిత్రాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.
ఆ తండ్రి శోకం..
సోమవారం చోటుచేసుకున్న భూకంప (Earthquake) తీవ్రతకు మెసుట్ హాన్సర్ నివాసముంటున్న ఇల్లు కుప్పకూలింది. ఈ విపత్తు సమయంలో బెడ్పై ఆదమరిచి నిద్రపోతున్న మెసుట్ 15 ఏళ్ల కుమార్తె ఇర్మాక్ శిథిలాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయింది. భవన దిమ్మెల మధ్యలో చేయి మాత్రమే కన్పిస్తోంది. కుమార్తె మృతదేహాన్ని చూసి ఆ తండ్రి గుండె బద్దలైంది. కన్నబిడ్డ చేయి పట్టుకుని మౌనంగా రోదిస్తూ అలాగే కూలబడ్డాడు. చలి వణికిస్తున్నా కూతుర్ని వదిలి వెళ్లలేక అలాగే కూర్చుండిపోయాడు. తుర్కియేలో (Turkey) కన్పించిన హృదయ విదారక దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడో జర్నలిస్టు. ఆ సమయంలో మాటలు రాలేదని, ఆ తండ్రి వేదన చూసి తనకే కన్నీళ్లు వచ్చాయని ఆ జర్నలిస్టు చెప్పారు.
చివరి ముద్దు..
భూకంపం శిథిలాల కింద చిక్కుకున్న ఓ కుటుంబంలో తల్లీతండ్రి బయటపడగా వారి కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. ప్రాణం లేని బిడ్డను చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. అంతిమ సంస్కారాలకు తీసుకెళ్తుండగా చిన్నారి చేతిపై చివరిసారిగా ముద్దుపెట్టి కుమార్తెకు కన్నీటి వీడ్కోలు పలికింది. తుర్కియే, సిరియా (Syria) సరిహద్దుల్లోని రేహనిల్ ప్రాంతంలో కన్పించిందీ దృశ్యం.
పుడమి ఒడిలో పుట్టి..
సిరియాలోని జిండిరెస్ ప్రాంతంలో శిథిలాల మధ్యలో జన్మించిందో శిశువు. భూకంపం (Earthquake)తో భవనం కూలిపోగా.. బండరాళ్ల మధ్య చిక్కుకున్న ఓ నిండు గర్భిణి మరణం అంచుల్లోనూ ప్రసవ వేదన భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆ తల్లి కన్నుమూయగా.. బిడ్డ ఏడుపు విన్న సహాయక సిబ్బంది పాపను కాపాడారు. బొడ్డుతాడుతో కన్పించిన ఆ పసికందును పట్టుకుని ఓ వ్యక్తి పరిగెడుతున్న దృశ్యం.. యావత్ ప్రపంచాన్ని కదిలించింది.
థాంక్యూ భారత్..
భూకంపంతో అతలాకుతలమైన తుర్కియేకు భారత్ (India) ఆపన్నహస్తం అందించింది. ‘ఆపరేషన్ దోస్త్ (Operation Dost)’లో భాగంగా భారత్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తుర్కియే వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా తమ దేశానికి చేస్తున్న సాయానికి చలించిన ఓ తుర్కిష్ మహిళ.. భారత సైనికురాలిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని కృతజ్ఞతలు తెలిపింది. ‘దోస్త్’ అనే పదానికి తుర్కిష్, హిందూస్థానీ భాషల్లో అర్థం ‘స్నేహితుడు’. భారత్ ఈ ఆపరేషన్కు అందుకే ‘దోస్త్’ అనే పేరు పెట్టింది.
కష్టం.. ప్రాణమై తిరిగొచ్చిన వేళ..
సిరియాలోని ఇడ్లిబ్ నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి ఓ చిన్నారిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి కష్టం ఫలించి ఓ ప్రాణం నిలబడటంతో ఆ సిబ్బంది పాపను ప్రేమగా ఎత్తుకొని ఆనందపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
దుబాయ్కు వచ్చేవారు, అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు.. అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీలో పేర్కొంది. -
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
Iran-Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వేళ ఎలాన్ మస్క్ శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆయన సోషల్మీడియా పోస్ట్ వైరల్గా మారింది. -
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్