Canada: పన్నూపై నిషేధం విధించండి.. కెనడా హిందూ గ్రూపుల విజ్ఞప్తి
సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత పన్నూ కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు హెచ్ఎఫ్సీ ప్రతినిధి కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిని కలిసి వినతి సమర్పించారు.
ఇంటర్నెట్డెస్క్: ఖలిస్థానీ టెర్రరిస్టు గురుపత్వంత్ సింగ్ పన్నూపై కెనడా(Canada)లో నిరసన పెరుగుతోంది. అతడు హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేయడంతో ది హిందూ ఫోరం కెనడా (హెచ్ఎఫ్సీ) మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడు కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరింది. అతడు భారతీయుల్లో భయాన్ని పెంచుతున్నాడని ఆరోపించింది.
హెచ్ఎఫ్సీకి చెందిన లీగల్ కౌన్సిల్ పీటర్ థ్రోనింగ్ నిన్న దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ను కలిశారు. ఈ సందర్భంగా హెచ్ఎఫ్సీ ఆందోళనను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇమ్మిగ్రేషన్ శాఖ తగిన దర్యాప్తు జరిపి పన్నూపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘గురపత్వంత్సింగ్ పన్నూ అమెరికాకు చెందిన సిఖ్స్ ఫర్ జస్టిస్కు ప్రతినిధిగా ఉన్నారు. అతడు సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని కోరుతున్నాడు. ఈ క్రమంలో అతడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ప్రకటన విడుదల చేశాడు. ఇప్పటికే పన్నూ, అతడి గ్రూపుపై భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. అతడు హింసాత్మక వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అతడు ఇటీవల ప్రకటన చేసిన సమయంలో కెనడాలో ఉన్నాడా అనే విషయంపై దర్యాప్తు చేయాలి. ఆ సమయంలో ఇక్కడ ఉంటే తగిన చర్యలు తీసుకోవాలి. అతడిని కెనడాలోకి రాకుండా నిషేధించాలి’’ అని హెచ్ఎఫ్సీ తరపు పీటర్ కోరారు.
పెండింగ్లో 70 కొలీజియం సిఫార్సులు
సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్జీఎఫ్) నేత గురుపత్వంత్ సింగ్ పన్నూపై ఇప్పటికే భారత్ కన్నెర్ర చేసింది. పంజాబ్లోని ఆ వేర్పాటువాద నేత ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం జప్తు చేసింది. ఖలిస్థాన్ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అంశంపై కెనడాతో వివాదం రగులుతున్నవేళ.. సామాజిక మాధ్యమాల్లో హిందువులపై పన్నూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయాడు. కెనడా విడిచి వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశాడు. మరో వీడియోలో కెనడాలోని భారత దౌత్య సిబ్బందిని కూడా బెదిరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
జర్మనీ(Germany)కి ఖతార్ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. -
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. -
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే దేశ మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
Israel-Hamas: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలికంగా కుదిరిన సంధి గడువు ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. -
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా