Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
హాంకాంగ్ పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు స్థానిక యంత్రాంగం ‘హలో హంకాంగ్’ పేరిట వినూత్న కార్యక్రమాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా సందర్శకులకు 5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందజేస్తామని తాజాగా ప్రకటించింది.
హాంకాంగ్: కొవిడ్(Covid) పరిస్థితులతో దారుణంగా దెబ్బతిన్న తమ పర్యాటక రంగాన్ని(Tourism) పునరుద్ధరించేందుకు హాంకాంగ్ (Hong Kong) నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షించేందుకుగానూ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే 5 లక్షల విమాన టికెట్లు ఉచితంగా అందజేస్తామని అక్కడి పాలన యంత్రాంగం తాజాగా ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు హాంకాంగ్ సీఈవో జాన్ లీ ‘హలో హాంకాంగ్ (Hello, Hong Kong)’ అనే పర్యాటక ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్శకులను ఆకర్షించేందుకు 5 లక్షల ఉచిత విమాన టిక్కెట్లను అందజేస్తామని చెప్పారు. ‘హాంకాంగ్ ఇప్పుడు చైనాతోపాటు మొత్తం ప్రపంచంతో అనుసంధానమై ఉంది. ఐసొలేషన్, క్వారంటైన్ వంటి ఆంక్షలు లేవు. పర్యాటకులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఇది సరైన సమయం’ అని తెలిపారు.
‘హలో హాంకాంగ్’ ప్రచారంలో భాగంగా ఇక్కడి మూడు విమానయాన సంస్థలు.. 2 బిలియన్ హాంకాంగ్ డాలర్ల (రూ.రెండు వేల కోట్లకుపైగా) విలువైన విమాన టికెట్లు అందజేస్తాయి. ఒకటి కొంటే ఒకటి ఉచితం, లక్కీ డ్రాలు, క్రీడల వంటి కార్యక్రమాల ద్వారా వాటిని అందజేయనుంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆరునెలలపాటు ఇది కొనసాగుతుందన్నారు. సందర్శకులకు ప్రత్యేక ఆఫర్లు, వోచర్లు, ఇతర ప్రోత్సాహకాలూ ఇవ్వనుంది. ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా దాదాపు 15 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించాలనేది హాంకాంగ్ ప్రణాళిక. వేసవిలో హాంకాంగ్వాసులకూ అదనంగా 80 వేల విమాన టికెట్లు అందజేస్తామని హాంకాంగ్ ఎయిర్పోర్ట్ అథారిటీ సీఈవో ఫ్రెడ్ లామ్ తెలిపారు.
కొవిడ్ సమయంలో హాంకాంగ్ ‘జీరో కొవిడ్’ విధానాన్ని పాటించింది. కఠిన నిబంధనలతో.. ప్రపంచ దేశాలతో సంబంధాలు తెంచుకుంది. సింగపూర్, జపాన్, తైవాన్ వంటి దేశాలతో పోల్చితే ఆంక్షలను నెమ్మదిగా సడలించింది. దీంతో పర్యాటక పోటీలో వెనుకంజ ఉంది. జనవరిలో చైనా ప్రధాన భూభాగంతో సరిహద్దును తిరిగి తెరిచినప్పటికీ.. పర్యాటకరంగ పునరుద్ధరణ మందగించింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మహమ్మారికి ముందు 2019లో హాంకాంగ్లో 5.6 కోట్ల మంది సందర్శకులు పర్యటించగా.. 2022లో ఆ సంఖ్య 2019తో పోల్చితే దాదాపు ఒక శాతం మాత్రమే. దీంతో పర్యాటకంలో గత వైభవాన్ని పొందేందుకు హాంకాంగ్ సంకల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
టేకాఫ్ సమయంలో విమానం టైరు ఊడిపోవడంతో ఓ బోయింగ్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. -
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
భారత ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రశంసిస్తూ.. జేపీ మోర్గాన్ సీఈఓ అమెరికన్లకు సూచనలు చేశారు. -
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్