World Bank: ఉక్రెయిన్ను పునర్నిర్మించాలంటే.. రూ.33లక్షల కోట్లు అవసరం..!
రష్యా దాడులతో పూర్తిగా నాశనమైన ఉక్రెయిన్ను మళ్లీ పునర్నిర్మించాలంటే 411 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు (World Bank) అంచనా వేసింది.
కీవ్: ఉక్రెయిన్పై (Ukraine) రష్యా మొదలుపెట్టిన దురాక్రమణ ఏడాది పూర్తైనా కొనసాగుతూనే ఉంది. భారీ స్థాయిలో క్షిపణి దాడులతో ఉక్రెయిన్ నగరాలను రష్యా (Russia) సేనలు ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో కొన్ని నగరాలు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఇలా ఆధునిక ప్రపంచంలో కనీవినీ ఎరుగని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా నాశనమైన ఉక్రెయిన్ను మళ్లీ పునర్నిర్మించాలంటే 411 బిలియన్ డాలర్లు (సుమారు రూ.33లక్షల కోట్లు) ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంకు (World Bank) అంచనా వేసింది. ధ్వంసమైన భవనాల శిథిలాల తొలగింపునకే 5బిలియన్ డాలర్లు (రూ.40వేల కోట్లు) అవుతుందని లెక్క కట్టింది.
ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా ఏడాది తర్వాత కూడా క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో శిథిలాల తొలగింపు.. పునర్నిర్మాణంపై ఉక్రెయిన్, ఐరాస, యూరోపియన్ కమిషన్తో కలిసి ప్రపంచ బ్యాంకు సంయుక్త నివేదిక విడుదల చేసింది. మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు 80లక్షలకు పైగా ఉక్రెయిన్ పౌరులు పేదరికంలోకి వెళ్లిపోయినట్లు అంచనా వేసింది. ఇళ్లు కూలిపోవడం మొదలు మానవ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంది. భవనాలు దెబ్బతినడంతో 135 బి.డాలర్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక పేర్కొంది. సుమారు 20లక్షల ఇళ్లు దెబ్బతిన్నట్లు అంచనా. ఏడాదిగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ఆర్థిక పరిణామాల వల్ల కలిగే నష్టం ఇందుకు అదనమని తెలిపింది.
ఉక్రెయిన్ పునరుద్ధరణకు 349 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28లక్షల కోట్లు) ఖర్చవుతుందని గత సెప్టెంబర్లో లెక్క కట్టిన ప్రపంచ బ్యాంకు తాజాగా ఈ నష్టం మరింత ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికీ క్షిపణి దాడులకు పాల్పడుతున్న రష్యా తీరును చూస్తుంటే రానున్న రోజుల్లో ఈ నష్టం భారీగా ఉండనుందని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్
Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
US Warns Pak: పాకిస్థాన్, ఇరాన్ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ను అమెరికా హెచ్చరించింది. -
అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి
గాజా పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. -
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
గుండె స్పందనలో తేడాలను ముందే పసిగట్టే ఏఐ
గుండె కొట్టుకునే రేటులో చోటుచేసుకునే మార్పుల (కార్డియాక్ అరిత్మియా)ను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. -
దీర్ఘకాల నొప్పికి సామాజిక-ఆర్థిక మూలాలు!
సామాజిక-ఆర్థికపరంగా దిగువ స్థాయిలో ఉన్నవారికి గాయాలు అనంతరం దీర్ఘకాల నొప్పి బారినపడే ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటుందని తాజా పరిశోధన పేర్కొంది. -
అంతరిక్షంలోకి సాధారణ పౌరులు
అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను రోదసిలోకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ (సెరా) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
గాల్లో ఢీకొన్న రెండు సైనిక హెలికాప్టర్లు
మలేసియాలో దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకదళ వార్షికోత్సవాల కోసం శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రెండు సైనిక హెలికాప్టర్లు ప్రమాదవశాత్తు ఢీకొని కూలిపోయాయి. -
ఉక్రెయిన్కు బ్రిటన్ రూ.542 కోట్ల ప్యాకేజీ
ఆయుధాల కొరతతో ఇబ్బంది పడుతున్నాం.. సైనిక సాయం కావాలంటూ గత కొంతకాలంగా మొరపెట్టుకుంటున్న ఉక్రెయిన్కు మరో ఊరట కలిగించే వార్త. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి
హెజ్బొల్లా కీలక నేతలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మంగళవారం ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో ఇద్దరు హెజ్బొల్లా ఉగ్రవాదులు మృతి చెందారు. -
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్