ukraine :పుతిన్ దాచిపెట్టాడు.. పై వాడు బయటపెట్టాడు
రక్తసిక్తమైన ఉక్రెయిన్లో అసువులు బాసిన ప్రజల్లో ఏ ఒక్కరి మరణానికి సాక్ష్యాలు లేవు. రావు..
ఉపగ్రహ చిత్రాలు వాస్తవాలు చెబుతున్నాయి
దిల్లీ: రక్తసిక్తమైన ఉక్రెయిన్లో అసువులు బాసిన ప్రజల్లో ఏ ఒక్కరి మరణానికి సాక్ష్యాలు లేవు. రావు.. రాలేవనే ధైర్యంతోనే రష్యన్ సైనికులూ, వారికి ఆదేశాలు జారీ చేసిన పుతిన్ సృష్టించిన మారణహోమం నాగరిక సమాజం జీర్ణించుకోలేకపోతోంది. ఇసుమంత పశ్చాత్తాపం లేని రష్యన్ సేనలకు గుణపాఠం చెప్పాలనిపించిందేమో మాక్సర్ ఉపగ్రహ రూపంలో నిజానిజాలు ప్రపంచ ప్రజల కళ్లముందుకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఐక్యరాజ్య సమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ బుచా హత్యలపై స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాయి.
ఉపగ్రహ చిత్రాలు చూపించిన దారుణాలు...
మాక్సర్ ఉపగ్రహాలు బుచా వీధుల్లో మార్చి 30న రష్యన్ సైనికులు సృష్టించిన బీభత్సానికి సంబంధించి ఆధారాలను చూపించి రష్యన్ దళాలకు వ్యతిరేకంగా తిరుగులేని సాక్ష్యాలను చేకూర్చాయి. వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న పౌరుల మృతదేహాలను చిత్రించాయి. మార్చి 31న తీసిన మరో చిత్రంలో బుచాలోని చర్చి మైదానంలో సామూహిక సమాధి ఉండే అవకాశం ఉందని చూపించింది. ఈ చిత్రంలో దాదాపు 45 అడుగుల పొడవున్న కందకం ఉంది. మార్చి 10 న తీసిన చిత్రం కందకం తవ్వడానికి ప్రారంభంలా కనిపిస్తోంది. మాక్సర్ గూగుల్ మాప్స్, గూగుల్ ఎర్త్ వంటి సంస్థలకు చిత్రాలు అందిస్తోంది. రష్యన్ దళాలు సృష్టించిన బీభత్సాన్ని డాక్యుమెంట్ రూపంలో అందించింది. ఈ సంస్థకు చెందిన నాలుగు ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి.
రష్యా నిరాకరణ
ఇంత జరిగినా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 3 న చేసిన టెలిగ్రామ్ పోస్ట్లో హత్యలకు బాధ్యతను నిరాకరించింది. రష్యన్ సేనలు మార్చి 30 నాటికి ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగినట్లు చెబుతోంది. మరో వైపు ఇతర దేశాల నుంచి వస్తోన్న నివేదికలు ఈ యుద్ధ నేరాలు అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ఉల్లంఘనపై తీవ్రమైన ప్రశ్నలను లెవనెత్తుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?