Ukraine Crisis: వందల కొద్దీ విమానాలను ఇక వదిలేసుకోవడమేనా..?
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలల్లోని వైమానికి సేవల సంస్థలకు భారీ నష్టం వాటిల్లనుంది.
* పశ్చిమ దేశాల విమాన లీజు కంపెనీలకు షాక్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలల్లోని వైమానిక సేవల సంస్థలకు భారీ నష్టం వాటిల్లనుంది. రష్యాపై విధించిన భారీ ఆంక్షల ప్రతికూల ప్రభావం పశ్చిమదేశాల కంపెనీలపై కూడా పడుతోంది. వందల కొద్దీ విమానాలను కోల్పోయే పరిస్థితి పలు కంపెనీలకు తలెత్తింది. దీంతో ఆ కంపెనీలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఈ యుద్ధం పిడుగులా పడింది.
గత నెల చివర్లో ఐరోపా సమాఖ్య, యూకే, అమెరికా, కెనడా దేశాల కంపెనీలు ఆయా ప్రభుత్వాల ఆదేశాల మేరకు రష్యాతో ఉన్న విమానాల లీజింగ్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. తమ విమానాలు వెనక్కి తెచ్చుకోవడానికి 30 రోజుల సమయం ఇచ్చారు. అంటే మార్చి 28 నాటికి రష్యాకు లీజ్కిచ్చిన పౌర విమానాలను పశ్చిమ దేశాల కంపెనీలు వాపస్ తీసకోవాల్సి ఉంది. మొత్తం 523 విమానాలను రష్యాలోని విమానయాన సేవల సంస్థలకు లీజుకు ఇచ్చారు. వీటిల్లో ఎస్7 ఎయిర్లైన్స్ 101 విమానాలు, ఏరోఫ్లోట్ 89, ఏరోక్యాప్ సంస్థ 142 విమానాలను లీజుకు ఇచ్చినట్లు తేలింది. ఈ విమానాల మొత్తం విలువ దాదాపు 12 బిలియన్ డాలర్లకు పైమాటే.
దీంతో మార్చి 28 డెడ్లైన్ దగ్గరపడే కొద్దీ విమానయాన సంస్థల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మార్చి 9 నాటికి కేవలం 24 విమానాలను మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. కానీ, వీటిల్లో కూడా చాలా వాటికి సంబంధించిన రికార్డులు రష్యాలోని విమానయాన సంస్థల వద్దే ఉన్నాయి. ఫలితంగా ఇవి కూడా పెద్దగా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది.
ఒలిగార్క్ల ఆస్తులను పశ్చిమ దేశాలు స్తంభింపజేయడంపై గుర్రుగా ఉన్న రష్యా.. ఈ లీజుల రద్దు, విమానాలు వెనక్కి పంపే ప్రక్రియను వీలైనంత కఠినతరంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. రష్యాకు చెందిన నియంత్రణ సంస్థ రోసావియాట్సియా దేశ గగనతలంలో అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను మరింత బిగించింది. దీంతో లీజులో ఉన్న విమనాలు వెనక్కి తీసుకువెళ్లడం సవాలుగా మారింది. ‘‘విమానాలను శాశ్వతంగా వదులుకొనే పరిస్థితి తలెత్తుతుందన్నదే అతిపెద్ద భయంగా మారింది’’ అని విమానాల రికవరీ సేవలు అందించే నొమాడిక్ ఏవియేషన్ ఎండీ స్టీవ్ గియోర్డానో అభిప్రాయపడ్డారు. రష్యా ఆయా కంపెనీలకు డబ్బుచెల్లించి విమానాలను కొనుగోలు చేయాలన్నా.. ప్రస్తుత ఆంక్షల కారణంగా చెల్లింపులు దుర్లభమవుతాయి.
స్పేర్ పార్టులుగా మార్చేస్తుందేమో..
బోయింగ్, ఎయిర్ బస్ వంటి సంస్థలు రష్యాతో సంబంధాలు తెంపుకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశానికి సదరు విమాన తయారీ సంస్థల నుంచి ఎటువంటి విడి భాగాలు, సర్వీసులు అందవు. దీంతో రష్యా వద్ద ఉన్న ఆయా కంపెనీల విమానాలు కొన్నాళ్ల తర్వాత విడిభాగాలు లేక మూలన పడే పరిస్థితి వస్తుంది. ఈ విమానాలకు రష్యా బయట సర్వీసులు చేయించాలన్న సాధ్యంకాదు. ఎందుకంటే చుట్టుపక్కల దేశాల్లో చాలా వరకు రష్యా విమానాల రాకపోకలకు గగనతలాన్ని మూసివేశాయి.
ఈ క్రమంలో రష్యా విడిభాగాల పంపిణీదారులను ఇతర దేశాల్లో వెతుక్కోవాలి. చైనా వంటి దేశాల నుంచి మూడో కంటికి తెలియకుండా విడిభాగాలను నిరంతరం తెప్పించుకోవాలి. ఒక వేళ ఆంక్షల భయం కారణంగా ఆయా దేశాలు నిరాకరిస్తే.. విదేశీ నిపుణులను తెప్పించుకొని సొంతగానే సర్వీసు, మెయింటెనెన్స్ విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇప్పటికే రష్యా గడ్డపై నిలిచిపోయిన లీజు విమానాల్లో కొన్నింటిని విడిభాగాల కోసం వాడుకొనే అవకాశం ఉంది. ఇలా సేకరించిన విడిభాగాలను మిగిలిన విమానాలకు వాడి.. వాటిని గాల్లోకి ఎగిరే స్థితిలో కొనసాగిస్తుంది. ఇదే జరిగితే లీజు కంపెనీలు ఈ విమానాలను రైటాఫ్ చేసుకోవడం మినహా మరో మార్గంలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
బాల్టిక్ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్ జామ్ (GPS Jam) వెనక రష్యా రహస్య ఆయుధం ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. -
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్ ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నాసా ఆ వరదల తీవ్రతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను తీసింది. -
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి
Malaysia: సైనిక విన్యాసాలు చేస్తున్న రెండు నేవీ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. మలేసియాలో జరిగిన ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. -
ఎలాన్ మస్క్ ఓ ‘పొగరుబోతు బిలియనీర్’: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
Elon Musk: ఆస్ట్రేలియాలో బిషప్పై దాడికి సంబంధించిన కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా తొలగించేందుకు ఎక్స్ నిరాకరించింది. దీంతో ఎలాన్ మస్క్పై ఆ దేశ ప్రధాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ నిఘా వర్గాలు.. హమాస్ కదలికలను అంచనా వేయడంలో విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి.. మేజర్ జనరల్ అహరాన్ హలీవా రాజీనామా చేశారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులు అయినట్లు తాజా నివేదిక ఒకటి (కాంగ్రెషనల్ రిపోర్ట్) పేర్కొంది. -
సీఏఏలో రాజ్యాంగ ఉల్లంఘన!
పౌరసత్వ సవరణ చట్టంలోని (సీఏఏ) కీలక నిబంధనలు భారత రాజ్యాంగంలోని అధికరణలను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అమెరికా కాంగ్రెస్లోని స్వతంత్ర పరిశోధన విభాగం నివేదిక పేర్కొంది. -
ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్జెన్ వీసా
తరచూ ఐరోపా పర్యటనకు వెళ్లే భారతీయులకు శుభవార్త. ఇకపై వారు అయిదేళ్ల కాల పరిమితితో బహుళ ప్రవేశ షెన్జెన్ వీసా పొందొచ్చు. -
చైనా అనుకూల పార్టీకి మాల్దీవుల్లో ‘సూపర్ మెజార్టీ’
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్సీ) ‘సూపర్ మెజార్టీ’తో విజయం సాధించింది. -
ఉగ్రవాద నిర్మూలనకు పాక్, ఇరాన్ ప్రతిన
ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి సంయుక్తంగా చర్యలు చేపట్టాలని పాకిస్థాన్, ఇరాన్ నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాద స్థావరాల విషయంలో కొన్ని నెలల క్రితం పరస్పర దాడులు నిర్వహించుకున్న రెండు దేశాలూ సోమవారం వివిధ అంశాలపై చర్చించుకున్నాయి. -
283 మృతదేహాల సామూహిక ఖననం
గాజాలోని ఖాన్ యూనిస్లో ఉన్న నాజర్ ఆసుపత్రివద్ద 283 మృత దేహాలను సామూహికంగా ఇజ్రాయెల్ ఖననం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. -
పిండంపై ఒత్తిడి పెరిగితే శిశు ముఖాకృతిలో మార్పులు
గర్భంలో ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే.. శిశువు ముఖాకృతి ఎదుగుదలపై ప్రభావం పడొచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖంలో అవకారాలకూ అది దారితీయవచ్చని తేల్చింది. -
తండ్రి తిండి ప్రభావం సంతానంపై..!
తండ్రి తినే ఆహారం పిల్లలపై విభిన్న రీతుల్లో ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది కుమారుల ఆదుర్దా స్థాయిని, కుమార్తెల్లో జీవక్రియను ప్రభావితం చేస్తుందని వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!