Prince Harry: విలియంకు నేనొక ‘స్పేర్’ పార్ట్.. ఆత్మకథలో హ్యారీ సంచలన వ్యాఖ్య..!
ప్రిన్స్ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర సంచలనంగా మారింది. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాలను అందులో పొందుపరిచారు.
వాషింగ్టన్: బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ప్రిన్స్ హ్యారీ(Prince Harry) ‘స్పేర్’ పేరిట స్వీయ జీవిత చరిత్రను రాశారు. ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ పుస్తకం బ్రిటన్లో రికార్డు అమ్మకాలు నమోదుచేస్తోంది. ఈ సందర్భంగా హ్యారీ చిన్నతనం, తన సోదరుడితో ఉన్న బంధం గురించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
‘విల్లీ(Prince William ) నా కంటే రెండేళ్లు పెద్దవాడు. విల్లీ సింహాసనానికి వారసుడు. నేను స్పేర్(అదనం). నేను అతడి నీడను. ప్లాన్ ఏ పనిచేయనప్పుడు నన్ను ప్లాన్ బిగా వాడతారు. విల్లీకి ఏదైనా జరగరానిది జరిగితే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు నన్ను ఈ లోకంలోకి తీసుకువచ్చారు’ అని వెల్లడించారు.
‘నా తండ్రి కింగ్ చార్లెస్-3, నా సోదరుడు విలియం ఎన్నడూ ఒకే విమానంలో ప్రయాణించరు. దాంతో సింహాసనం అధిష్టించేందుకు తర్వాత వరుసలో ఉన్న వారికి ఎలాంటి అనూహ్య ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. నా విషయంలో ఎప్పుడూ అలాంటి జాగ్రత్త ఉండదు. నన్నెప్పుడు అదనం(Spare)గానే భావించడం వల్ల పెద్దగా ప్రాధన్యం ఉండేది కాదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను 20 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నా తండ్రి చెప్పిన మాటల గురించి ఎవరో అంటుంటే విన్నాను. అవి నేను పుట్టినప్పుడు అమ్మతో నాన్న చెప్పిన మాటలు. ‘అద్భుతం.. నువ్వు నాకు వారసుడు(Heir), స్పేర్(Spare)ని ఇచ్చావు. నేను నా పని పూర్తి చేశాను’ అని ఆ మాటల సారాంశం’’ అని హ్యారీ రాసుకొచ్చారు.
‘స్పేర్ (Spare)’ పేరుతో ప్రిన్స్ హ్యారీ (Prince Harry) రాసిన ఆత్మకథలో రాజకుటుంబం (Royal Family)లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అవమానాలను బయటపెట్టారు. తన తండ్రి కింగ్ ఛార్లెస్, సవతి తల్లి కెమిల్లా, అన్నయ్య ప్రిన్స్ విలియం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. తన భార్య మేఘన్ మెర్కెల్ను రాజకుటుంబం వేదనకు గురిచేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!